మోహినీ అవతారంలో మలయప్ప స్వామి సాయంత్రం 6:30 కు గరుడవాహనంపై విహరించనున్న శ్రీవారు
x

మోహినీ అవతారంలో మలయప్ప స్వామి సాయంత్రం 6:30 కు గరుడవాహనంపై విహరించనున్న శ్రీవారు


తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిచ్చారు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు శ్రీవారి గరుడవాహన సేవ ప్రారంభం కానుంది.


Read More
Next Story