తిరుమల లడ్డుపై సుప్రీమ్ కోర్టులో విచారణ రేపటికి వాయిదా
x

తిరుమల లడ్డుపై సుప్రీమ్ కోర్టులో విచారణ రేపటికి వాయిదా

కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు విషయమై సూచనలు తీసుకోవాలని కోర్ట్ సోలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. విచారణ రేపు ఉదయం 10.30కు మొదలవుతుంది.


తిరుమల లడ్డులో కల్తీనెయ్యి వాడారన్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టులో దాఖలైన పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం భోజనానంతరం కేసు విచారణకు రాగా, రేపు ఉదయం 10.30 వరకు వాయిదా కావాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు విషయమై సూచనలు తీసుకోవాలని కోర్ట్ సోలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. విచారణ రేపు ఉదయం 10.30కు మొదలవుతుంది.

Read More
Next Story