‘బీజేపీ, బీఆర్ఎస్‌తో పోరాడాల్సిందే’
x

‘బీజేపీ, బీఆర్ఎస్‌తో పోరాడాల్సిందే’

కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెచ్చింది. కాంగ్రెస్ ఎలాంటి పోరాటానికి అయిన సిద్ధంగా ఉండాలి అని పిలుపునిచ్చారు.


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టారు. ఆమె శుక్రవారం కాచీగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఆమెకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత గాంధీ భవన్‌లో పార్టీ నాయకులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. పాలనపై దిశానిర్దేశం చేశారు. అధికారం రావడంతో తమ పోరాటం ముగియలేదని, అసలు పోరు ఇప్పుడే మొదలైందని ఆమె చెప్పారు. అధికారం వచ్చింది కదా అని రిలాక్స్ అవ్వొద్దని, అసలు పని ఇప్పటి నుంచే ఉంటుందని ఆమె దిశానిర్దేశం చేశారు.

‘‘ఇప్పుడు మనం ప్రభుత్వం లో ఉన్నాం.. పేద వాడి కోసం పని చేయాలి. పేదల మొఖంలో నవ్వులు చూడాలి.. అప్పుడే మనం పని చేసినట్టు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉంది.. అనేక రకాలుగా పోరాటాలు చేసాము.. అందుకే తెలంగాణ లో అధికారంలోకి వచ్చాము. రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం భారత్ జొడో యాత్ర నిర్వహించి ఒక మైదానాన్ని తయారు చేశారు. మనం దాని కోసం పోరాటం చేయాలి. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలతో మనం ఇక్కడ పోరాటం చేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెచ్చింది. కాంగ్రెస్ ఎలాంటి పోరాటానికి అయిన సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలి. పదేళ్లు గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేశారు. వారికి న్యాయం జరగాలి.. పదవులు పొందిన వారు ప్రజల కోసం పని చేయాలి. మనం చేసిన పనులను ప్రజలకు వివరించాలి. దేశంలో ఎక్కడా లేని విదంగా ఇక్కడ కులగణన చేపట్టాము.. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. గ్రామ గ్రామన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి. ఈ విషయంలో పీసీసీ ఒక పకడ్బందీగా కాలెండర్ సిద్ధం చేయాలి’’ అని తెలిపారు.

Read More
Next Story