పోచంపల్లి చేనేత చీరలకు గ్లోబల్ ఖ్యాతి
x
చీరలో మెరిసిన ఫెమీనా మిస్ ఇండియా నందినీ గుప్తా

పోచంపల్లి చేనేత చీరలకు గ్లోబల్ ఖ్యాతి

తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లి చేనేత చీరలకు గ్లోబల్ ఖ్యాతి లభించనుంది. 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పోచంపల్లి చీరలు ప్రపంచ వేదికపై మెరవనున్నాయి.


72వ అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ సుందరీమణులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి చీరలను చూసేందుకు ఆ గ్రామాన్ని సందర్శించనున్నారు. మే 15వతేదీన పోచంపల్లిని మిస్ వరల్డ్ 2025 పోటీదారులు సందర్శించనున్నారు. దీంతో తెలంగాణ చేనేత ఆభరణాన్ని అందిస్తున్న పోచంపల్లి గ్రామం ప్రపంచ వేదికపై మెరవనుంది.




తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పోచంపల్లి గ్రామం సంక్లిష్టమైన ఇక్కత్ నేత పద్ధతులకు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. పోచంపల్లిని యునెస్కో ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది. ఇది చేతిపనులు, సంస్కృతి, వారసత్వానికి సజీవ మ్యూజియంగా నిలిచింది.





చేనేత మగ్గాన్ని సందర్శించనున్న అందాల భామలు
మిస్ వరల్డ్ పోటీదారులు ఇక్కత్ సాంప్రదాయ టై-అండ్-డై ప్రక్రియను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. నిష్ణాతులైన నేత కార్మికులతో అందాలభామలు సంభాషిస్తారు. హైదరాబాద్ నిజాంలు ఒకప్పుడు అభిమానించిన డబుల్ ఇకత్ కళాఖండం అయిన ఐకానిక్ టెలియా రుమల్ తయారీని చూస్తారు.





ఆచార్య వినోబా భావే నేతృత్వంలోని భూదాన్ ఉద్యమంలో చారిత్రాత్మక పాత్ర పోషించిన ఈ గ్రామం వస్త్ర కళాత్మకత, సామాజిక-సాంస్కృతిక వారసత్వం అందిస్తుంది. మిస్ వరల్డ్ వేదిక పై తెలంగాణ గొప్ప చేనేత వారసత్వాన్ని ప్రపంచ పటంలో ఉంచుతుంది. పోచంపల్లి యొక్క శక్తివంతమైన నేత, గ్రామీణ హస్తకళ ,సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించడం ద్వారా, ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత అభిమానులకు వేడుకగా నిలవనుంది.



Read More
Next Story