
లోక్ సభలో తెలంగాణ వాణి వినిపించిన మన ఎంపీలు
లోక్సభలో పార్లమెంట్ సభ్యులు తెలంగాణ వాణిని వినిపించారు.పార్లమెంటుకు హాజరులో ఎంపీ చామల, ప్రశ్నల్లో ఈటెల, డిబేట్లలో అసదుద్దీన్ ఒవైసీ అగ్రస్థానంలో నిలిచారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన లోక్సభ సభ్యులు పార్లమెంటులో తెలంగాణ సమస్యలను లేవనెత్తారు. భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి వందశాతం హాజరుతో పార్లమెంటులో 79 ప్రశ్నలు అడిగి అధికార ఎన్డీఏ పక్షాన్ని నిలదీశారు. మల్కాజిగిరికి చెందిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పార్లమెంటులో 80 ప్రశ్నలు అడిగి తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలిచారు. మరో వైపు 95 శాతం హాజరుతో చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండవ స్థానంలో ఉన్నారు. పార్లమెంటులో జరిగి 21 డిబేట్లలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొని చర్చల్లో అగ్రస్థానంలో నిలిచారు.
ఇదీ తెలంగాణ ఎంపీల ప్రొగ్రెస్ రిపోర్ట్
#AdminPost
— Kiran Kumar Chamala (@kiran_chamala) April 16, 2025
పార్లమెంట్ లో వంద శాతం హాజరుతో, ఎంపీగా గెలిచినప్పట్నుంచి రాష్ట్ర ప్రయోజనార్థం, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంపై 79 ప్రశ్నలు సంధించిన ప్రజానాయకుడు.. మన భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్రానికి… pic.twitter.com/HzExdZvyjf
తక్కువ ప్రశ్నలడిగిన ఎంపీలు