ఢిల్లీ వర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
x

ఢిల్లీ వర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తీవ్ర అనారోగ్యంతో శనివారం రాత్రి కన్నుమూశారు.హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ సాయిబాబా తుదిశ్వాస విడిచారు.


ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తీవ్ర అనారోగ్యంతో శనివారం రాత్రి కన్నుమూశారు.హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ సాయిబాబా మృత్యువాత పడ్డారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు.

- 2014వ సంవత్సరంలో సాయిబాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిదేళ్ల పాటు ఆయన జైలులోనే గడిపారు. జైలులో ఉన్న సమయంలో ఈయన ఆరోగ్యం దెబ్బతింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసులో సాయిబాబా నిర్దోషిగా బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ ఈ ఏడాది మార్చి నెలలో తీర్పు ఇచ్చింది.
- జైలు నుంచి విడుదలయ్యారు.ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద సాయిబాబాపై మహారాష్ట్ర పోలీసులు కేసు పెట్టారు.ఈ కేసులో గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసును బాంబే హైకోర్టు 2022లోనే కొట్టివేసింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేయగా అతని విడుదలలో జాప్యం జరిగింది.

అమలాపురం సాయిబాబా జన్మస్థలం
సాయిబాబా 1967వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పేద రైతు కుటుంబంలో జన్మించారు. పోలియో కారణంగా అయిదేళ్ల వయసు నుంచి వీల్ ఛైర్ ను ఉపయోగిస్తున్నారు.

ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి తొలగింపు
ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో ఆంగ్ల భాష బోధించారు.మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసు నమోదుతో కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి తొలగించారు.


Read More
Next Story