పసుపు రైతు కష్టాలు కాంగ్రెస్‌కు పట్టవా: కవిత
x

పసుపు రైతు కష్టాలు కాంగ్రెస్‌కు పట్టవా: కవిత

రైతులకు గిట్టుబాటు ధర రాకపోతున్నా ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమేనన్నారు కవిత.


పసుపు రైతుల కష్టాలను తగ్గించడానికి ఏర్పాటు చేసిన పసుపు బోర్డు వల్ల పెద్దగా లాభం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పసుపు బోర్డు వచ్చిన తర్వాత కూడా పసుపు రైతులు గిట్టుబాటు ధర దక్కక తీవ్రఅవస్థలు పడుతున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలోని పసుపు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. పసుపు రైతుల కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు కవిత. పసుపు బోర్డు నామమాత్రంగానే ఉందని, దాని వల్ల పసుపు రైతులకు జరుగుతున్న మేలు ఒక్కటీ లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపుబోర్డుకు చట్టబద్దత లేకపోవడమే పసుపు రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణమని ఆమె ఆరోపించారు.

గిట్టుబాటు ధరలు లేక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోందని, అన్నదాతలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, మాటలు చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో క్వింటా పసుపుకు రూ.15వేల గిట్టుబాటు ధర కల్పిస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కనీసం రూ.9వేల కూడా రావడం లేదని, అయినా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర అందించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమని కవిత మండిపడ్డారు.

‘‘నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా ? గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది ? మాటలు చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. క్వింటాలు పసుపుకు 15 వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పసుపు కు కనీసం 9 వేలు రాని పరిస్థితి ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమే.

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలి. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్ చెప్పారు. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని స్పష్టం చేశారు.

Read More
Next Story