మెట్రోరైలు విస్తరణకు కేబినెట్ పచ్చజెండా
x

మెట్రోరైలు విస్తరణకు కేబినెట్ పచ్చజెండా

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం రాత్రి ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మెట్రో రైలు మార్గాల విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


తెలంగాణ మంత్రివర్గ సమావేశం శనివారం నాలుగు గంటలకు పైగా సాగింది. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.

- నాగోల్- ఎల్బీనగర్- హయత్ నగర్, ఎల్బీనగర్- శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోరైలు విస్తరణకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది.

- హన్మకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సన్న బియ్యానికి రూ.500లు బోనస్ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్‌ పోలీస్‌గ్రౌండ్స్‌ భూమి బదలాయించాలని కేబినెట్‌ తీర్మానించింది.



Read More
Next Story