తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్ర ఫిక్స్
x

తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్ర ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ'ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది.


తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ'ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. నూతనంగా ఏర్పాటైన ఈ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్ర నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీకి చైర్మన్‌గా వ్యవహరించడానికి ఆనంద్ మహీంద్ర అంగీకరించారని, కొద్ది రోజుల్లోనే వారు బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.

'రాష్ట్రంలోని యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించిందితెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్ర. దీనికి అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖుడినే అధినేతగా నియమిస్తాము' అని ముఖ్యమంత్రి ఇటీవల అసెంబ్లీలోనూ ప్రకటించారు. ఆనంద్ మహీంద్రా ఇటీవల హైదరాబాద్ లో రేవంత్ రెడ్డితో సమావేశమైన సందర్భంలోనూ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీపై చర్చలు జరిపారు.

కాగా, రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల పరిధిలోని బ్యాగరికంచె వద్ద తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ భవనానికి ముఖ్యమంత్రి గతవారం శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో ఏటా 20వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్ ఇవ్వడంతోపాటు ఆయా కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా స్కిల్ వర్సిటీని విస్తరించనున్నారు. బ్యాగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) భవంతి నుంచి స్కిల్‌ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

Read More
Next Story