కోదాడలో ఘోర ప్రమాదం.. లారీ కింద ఇరుక్కుపోయిన కారు
x

కోదాడలో ఘోర ప్రమాదం.. లారీ కింద ఇరుక్కుపోయిన కారు

హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హై వే పై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ వద్ద ఆగివున్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.


హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హై వే పై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ వద్ద ఆగివున్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారితో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయవడంతో ఆసుపరికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుండి కారులో విజయవాడకి బయలుదేరారు. చిన్నారికి దుర్గ గుడిలో చెవిపోగులు కుట్టించేందుకు గురువారం తెల్లవారుజామునే ఇంటి నుండి స్టార్ట్ అయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు సూర్యాపేట జిల్లా కోదాడ దుర్గపురం స్టేజ్ వద్దకు రాగానే ఆగి ఉన్న లారీ ని ఢీకొట్టింది. దీంతో కారు ముందు బాగా లారీ కిందకి వెళ్ళిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

అదే రూట్ లో వెళుతోన్న ఇతర ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. లారీ కింద ఇరుక్కుపోయిన కారుని స్థానికుల సహాయంతో బయటకి తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణించినవారి మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారి వివరాలు సేకరించి బంధువులకు సమాచారం అందించారు.

అతివేగమే యాక్సిడెంట్ కి కారణమని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. లారీ బ్రేక్ డౌన్ అవడంతో డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపివేశాడు. ఇదే క్రమంలో ప్రమాదానికి గురైన కారు డ్రైవర్ మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ ఆగిఉన్న లారీని గమనించకుండా ఢీకొట్టాడు. కారు స్పీడ్ ఎక్కువగా ఉండడంతో లారీని ఢీకొని ముందు భాగం లారీ కిందకి వెళ్లి ఇరుక్కుపోయింది.

Read More
Next Story