
అలా డ్రగ్స్కు బానిసయ్యా...
పోలీసుల విచారణలో తమిళ నటుడు శ్రీరామ్..
డ్రగ్స్ కేసులో తమిళ నటుడు శ్రీకాంత్ (Srikanth) అలియాస్ శ్రీరామ్ను చెన్నై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన నివాసంపై జరిపిన దాడిలో 1 గ్రాము కొకైన్ లభించడంతో పాటు మాదకద్రవ్యాల రక్త పరీక్షలో పాజిటివ్గా రావడంతో శ్రీరామ్ను సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం శ్రీరామ్ ఫుళల్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. న్యాయవాదుల అభ్యర్థన మేరకు శ్రీరామ్కు ఫస్ట్ క్లాస్ జైలు గదిని కేటాయించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
లావాదేవీలపై ఆరా..
శ్రీకాంత్ – ప్రసాద్ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలను పోలీసులు గుర్తించారు. 40 సార్లు కోకైన్ కొనుగోలు చేయడానికి శ్రీకాంత్ రూ.4.72 లక్షలు ఖర్చు చేసినట్టు ఆధారాలు లభించాయి. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు ఇద్దరిని మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ కూడా వేశారు.
డ్రగ్స్కు ఎలా అడిక్ట్ అయ్యాడు?
ప్రసాద్ శ్రీరామ్కు ఎనిమిదిసార్లు కోకైన్ సప్లై చేశాడు. అరెస్ట్కు ముందు కూడా 250 గ్రాముల కోకైన్ను ఇచ్చినట్టు వెలుగులోకి వచ్చింది. శ్రీరామ్ నటించిన ఓ సినిమాకు ప్రసాద్ కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. దాంతో ప్రసాద్ రూ. 10 లక్షల రెమ్యూనరేషన్ శ్రీరామ్కు చెల్లించాల్సి ఉంది. డబ్బు చెల్లించకపోగా అందుకు బదులుగా ప్రసాద్ శ్రీరామ్కు కోకైన్ సప్లై చేశాడు. ఆ తర్వాత శ్రీరామ్ డ్రగ్స్కు బానిసైపోయాడు. ‘‘మొదట మూడు సార్లు ప్రసాద్ నాకు ఇచ్చాడు. నాలుగోసారి నేను అడిగాను. అప్పటికే నేను పూర్తిగా అడిక్టయిపోయా..’’ అని శ్రీకాంత్ పోలీసుల విచారణలో చెప్పాడు.
టీవీ సీరియల్తో వెండితెరకు..
ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ 1999లో రూపొందించిన టీవీ సీరియల్ ‘‘జన్నల్ – మరబు కవితైగళ్తో’’ తో బుల్లితెర మీద నటించారు. 2002లో రోజా కూటం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. తమిళంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన శ్రీరామ్ తాజాగా తెలుగులో విజయంతి అనే చిత్రంలో కనిపించారు.