సంక్రాంతి కానుక: రేషన్‌ కార్డుదారులకు రూ.3 వేలు నగదు.. గిఫ్ట్ హాంఫర్
x

సంక్రాంతి కానుక: రేషన్‌ కార్డుదారులకు రూ.3 వేలు నగదు.. గిఫ్ట్ హాంఫర్

తర్వలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్ణయం..


Click the Play button to hear this message in audio format

సంక్రాంతి(Pongal) పండుగను పురస్కరించుకుని తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్‌కార్డుదారులకు పొంగల్ కానుకగా రూ. 3 వేలతో పాటు గిఫ్ట్ హాంపర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(CM Stalin) ఆదివారం (జనవరి 4) ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు మొత్తం రూ. 6,936.17 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.


గిఫ్ట్‌హ్యాంపర్..

రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు రూ. 3 నగదుతోపాటు కిలో బియ్యం, కిలో చక్కెర, ఒక పొడవాటి చెరుకు గడ, ధోతీ, చీర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు ఉన్న గిఫ్ట్‌హ్యాంపర్ ఇవ్వనున్నారు. అయితే గతేడాది కేవలం గిఫ్ట్ హ్యాంపర్‌ మాత్రమే ప్రభుత్వం అందించగా.. ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో నగదును కూడా ఇస్తుంది.


ఇంటింటికి టోకెన్లు..

పంపిణీ ప్రక్రియ సులభతరం చేయడంలో భాగంగా జనవరి తొలి వారంలోనే టోకెన్లను రేషన్ షాపు సిబ్బంది ఇంటింటికీ తిరిగి పంపిణీ చేయనున్నారు. ఆ టోకెన్‌పై పేర్కొన్న తేదీ, సమయం ఆధారంగా లబ్ధిదారులు.. వారికి కేటాయించిన రేషన్ షాప్‌లకు వెళ్లి నగదుతోపాటు.. గిఫ్ట్‌హ్యాంపర్ కూడా పొందేలా ఏర్పాటు చేశారు.

త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు ఒకవైపు ఎఐఎడిఎంకె-బీజేపీ కూటమి, మరోవైపు విజయ్ కొత్తగా స్థాపించిన టీవీకే పార్టీ గట్టి పోటీ ఇస్తున్నాయి.

Read More
Next Story