‘‘డబ్బులు తీసుకుని ఇళ్లను కేటాయిస్తున్నారు’’
x
కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్

‘‘డబ్బులు తీసుకుని ఇళ్లను కేటాయిస్తున్నారు’’

కర్ణాటక గృహ నిర్మాణ శాఖపై సొంత పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు


కర్ణాటక కాంగ్రెస్ లో కలకలం రేగింది. ప్రభుత్వం పేదలకు ఇళ్లను కేటాయించే పథకంలో అధికారులు డబ్బులు వస్తూలు చేస్తున్నారని, దీనిలో స్వయంగా మంత్రి ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరూ ఆరోపణలు గుప్పించారు.

ఈ వ్యాఖ్యలపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మాద్ ఖాన్ స్పందించారు. తన శాఖలో అసలు అలాంటి పనులు జరగట్లేదని వివరణ ఇచ్చారు. అవినీతి ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

‘‘నేను ఎప్పుడూ పేదరికాన్ని ఎదుర్కోలేదు. పేదల కోసం ఉద్దేశించిన ఇళ్లకు డబ్బులు వసూలు చేయలేదు. ఇళ్లకు డబ్బులు తీసుకోవడం క్షమించరాని నేరం. నా శాఖలో అలాంటి పద్దతులకు అవకాశం లేదు’’ అని ఆయన విలేకరులతో అన్నారు.

ఎమ్మెల్యే ఏం అన్నారంటే..
ఇళ్ల కేటాయింపులో లక్షలాది రూపాయల డబ్బు చేతులు మారుతుందని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఆరోపించారు. అయితే ఆయన ఏ ఎమ్మెల్యే, మంత్రి, అధికారి పేరును తన ఆరోపణల్లో ప్రస్తావించలేదు. ఈ విషయాన్నే మంత్రి కూడా గుర్తు చేశారు.
‘‘పంచాయతీలో ఎవరైన డబ్బులు తీసుకుంటే ఆ వివరాలు వెలుగులోకి తీసుకురావాలి. దర్యాప్తు ప్రారంభిస్తాం. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంపై నేను ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడతాను’’ అని ఆయన అన్నారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. ‘‘నేను పర్యటనలో ఉన్నారు. అందుకే సకాలంలో స్పందించలేకపోయాను. వచ్చిన వెంటనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన సమాచారం సేకరించాను’’ అని ఆయన అన్నారు.
ప్రత్యక్ష ప్రమేయం లేదు..
‘‘ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వానికి ప్రత్యక్ష ప్రమేయం లేదు. గ్రామపంచాయతీ స్థాయిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల ఆధారంగా కేటాయింపులు ఉంటాయి. బీఆర్ పాటిల్ స్వయంగా రాసిన లేఖ ఆధారంగా అలంద్ నియోజకవర్గానికి 950 ఇళ్లు కేటాయించాము’’ అని మంత్రి అన్నారు.
ఈ విషయంపై బేలూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తనపై ఎమ్మెల్యేకి తప్పుడు సమాచారం అందించారని చెప్పారు.
తన వ్యాఖ్యలు సమర్థించుకున్న పాటిల్
ఇళ్ల కేటాయింపులో అవినీతి ఆరోపణల వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ మరో వాటిని పునరావృతం చేశారు. ‘‘నేను చెప్పాల్సింది చెప్పాను. ముఖ్యమంత్రి ఏం చర్య తీసుకుంటారో నాకు తెలియదు.’’ అన్నారు.
ప్రతి ప్రభుత్వంలో అవినీతి ఉంటుందని అంగీకరించిన ఆయన, తాము ప్రజలకు అనేక హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామని, అవినీతి జరగకూడదని అన్నారు.
‘‘ఐదు నుంచి ఆరు పంచాయతీల్లో ప్రజలు తమ పనిని పూర్తి చేయడానికి లంచం చెల్లించాల్సి వచ్చింది. కొంతమంది పంచాయతీ అధ్యక్షులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్ట్ లను మార్చుకున్నారు’’ అని ఆరోపించారు.
ప్రభుత్వ నిష్క్రియాత్మకతపై తన నిరాశను వ్యక్తం చేశారు. ‘‘నా నియోజకవర్గానికి ఇళ్ల కేటాయింపులు కోరుతూ గృహ నిర్మాణ శాఖకు నాలుగు లేఖలు రాశాను. కానీ ఇప్పటి వరకూ ఒక అభ్యర్థన కూడా పరిష్కరించలేదు’’ అని పాటిల్ అన్నారు.


Read More
Next Story