హైకోర్టు భవన శంకుస్థాపన అంత గుట్టుచప్పుడు కాకుండా చేయాల్నా సీఎం సార్!
x

హైకోర్టు భవన శంకుస్థాపన అంత గుట్టుచప్పుడు కాకుండా చేయాల్నా సీఎం సార్!

మూడు రాష్ట్రాలకు సేవలందించిన హైకోర్టు భవనం ఇకపై కాలగర్భంలో కలువనుంది. వివాదాలు ఓపక్క, ఎన్నికల కోడ్ ఆంక్షలు మరో పక్క అమల్లో ఉండగా కొత్త భవనానికి శంకుస్ధాపనేంటీ?


మూడు రాష్ట్రాలకు సేవలందించిన హైకోర్టు భవనం ఇకపై కాలగర్భంలో కలువనుంది. నిజాం కాలంలో హైదరాబాద్‌ రాష్ట్రానికి, భాషాప్రాతిపదిక రాష్ట్రాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కి, 2014 రాష్ట్ర పునర్‌ విభజన చట్టంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవలందించించిన హైకోర్టు భవనం తరలిపోనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ చేతుల మీదుగా బుధవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన భవనాలకు శంకుస్థాపన జరుగనుంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆర్భాటం లేకుండా నిరాబండరంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఓ చారిత్రక భవనానికి పునాదులు వేసేటపుడు ఇంత నిగూఢంగా ఏదో తూతూ మంత్రంగా జరపడం కన్నా ఎన్నికల తర్వాత ప్రముఖులందరి సమక్షంలో నిర్వహించి ఉంటే బాగుండదని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల నిబంధనల మూలంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ రాకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఒకనాటి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నేటి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాలలో హైకోర్టు నూతన భవన సముదాయానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గతంలో ప్రకటించారు. దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే వ్యవసాయ యూనివర్సిటీ భూములను లాక్కోవద్దని విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసనలు, తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా వీరి ఆందోళనకు మద్దతు పలికారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సరిగ్గా ఈ దశలో హైకోర్టు నూతన భవనాలకు శంకుస్థాపన జరుగనుంది.

Read More
Next Story