రూపాయి చిహ్నాన్ని మార్చిన తమిళనాడు సర్కార్
x

రూపాయి చిహ్నాన్ని మార్చిన తమిళనాడు సర్కార్

దేవనాగరి లిపిలోని చిహ్నానికి బదులుగా తమిళభాషలోని అక్షరంతో లోగో విడుదల, తెలివితక్కువ వారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ


జాతీయ విద్యావిధానంలో భాగంగా త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ, హిందీపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్న తమిళనాడు తాజాగా మరో అడుగు ముందుకేసింది. రూపాయికి బదులుగా ప్రస్తుతం వాడుతున్న దేవనాగరి లిపిలో ఉన్నసింబల్ కు బదులుగా తమిళ భాషలోని ‘రుబాయి’ లోని ‘రు’ సింబల్ వాడాలని నిర్ణయించుకుంది.

డీఎంకే ప్రభుత్వం గురువారం 2025-26 బడ్జెట్ ను లోగోను విడుదల చేసింది. ఈ సందర్భంగా తమిళనాడు కొత్త రూపాయి లోగోను విడుదల చేసింది. ఇందులో దేవనాగరి లిపిలోని సింబల్ కు బదులు తమిళభాషలోని అక్షరాన్ని వాడింది.

ఇది స్థానిక భాషలో భారతీయ కరెన్సీని సూచిస్తుంది. అలాగే లోగోపై ‘‘అందరికి ప్రతిదీ’’ అనే శీర్షికను సైతం విడుదల చేసింది. ఇది డీఎంకే తన సమ్మిళిత పాలన నమూనాను తెలియజేసే విధంగా ఇది రూపొందించారు. తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు శుక్రవారం 2025-26 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.




తెలివి తక్కువ దద్దమ్మలు..

డీఎంకే చర్యను బీజేపీ ఖండించింది. ఇది తెలివి తక్కువ చర్యగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.
‘‘2025-26 సంవత్సరానికి డీఎంకే ప్రభుత్వం రూపొందించిన రాష్ట్ర బడ్జెట్ ఒక తమిళుడు రూపొందించిన రూపాయి చిహ్నాన్ని భర్తీ చేసింది. ఇది భారత్ స్వీకరించిన దాన్నినిజంగా భర్తీ చేస్తుందా?
ఈ చిహ్నాన్ని రూపొందించిన తిరు ఉదయ్ కుమార్, మాజీ డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు.. తిరు@ఎంకే స్టాలిన్ మీరు ఎంత తెలివి తక్కువ వారు అవుతారు’’ అని ఆయన సోషల్ మీడియా పోస్టులో విమర్శలు గుప్పించారు.
ఆయన 2024-25 తమిళనాడు బడ్జెట్ లోగోను కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇందులో భారత రూపాయి చిహ్నం ఉంది. కేంద్రం, తమిళనాడు మధ్య భాషా వివాదం మధ్య ఈ పరిణామం జరిగింది.
కేంద్రం హిందీని నేర్చుకోవాలని, విదేశీ భాషలపై ఆధారపడటం మంచిది కాదని చెబుతుండగా, తమిళనాడు అందుకు తిరస్కరిస్తూ కేవలం తమిళం, ఇంగ్లీష్ ను మాత్రమే అమలు చేస్తామని చెబుతోంది.


Read More
Next Story