ఈడీకి మరోసారి తలంటిన మద్రాస్ హైకోర్టు
x

ఈడీకి మరోసారి తలంటిన మద్రాస్ హైకోర్టు

చట్టంలో లేని నిబంధనలు ఎలా వాడుతున్నారన్న న్యాయస్థానం


మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) 2002 ప్రకారం సోదాలు, వస్తువుల స్వాధీనం, తాళం వేయబడిన ప్రాంగణాలను సీల్ చేసే అధికారం తమకు లేదని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మద్రాస్ హైకోర్టు ముందు అంగీకరించింది.

తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటేడ్ (టాస్మాక్) తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ దర్యాప్తులో ఈడీ చర్యలను సవాల్ చేస్తూ నిర్మాత ఆకాశ్ భాస్కరన్, ఆయన సన్నిహితుడు విక్రమ్ రవీంద్రన్ రిట్ పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా ఈడీ విషయాన్ని అంగీకరించింది. ఆస్తులను సీల్ చేయడం, యాక్సెస్ ను పరిమితం చేయడానికి చట్టపరమైన ఆధారాన్ని కోర్టు ప్రశ్నించవలసి వచ్చింది. దీనితో తమకు చట్టం ఆ అధికారం ఇవ్వలేదని తెలిపింది.
కోర్టు ఆందోళన
న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, వి లక్ష్మీ నారాయణన్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈడీ ఆస్తులను సీల్ చేసే పద్దతిపై ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి చర్యలకు చట్టపరమైన నిబంధనలు ఏవని ప్రశ్నించింది.
మే 16 న చెన్నైలోని సెమ్మెంచేరీలోని భాస్కరన్ కార్యాలయాన్ని, చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని అద్దెకు తీసుకున్న నివాస ప్లాట్ ను ఈడీ సీల్ చేసినట్లు బాధితులు కోర్టు దృష్టికి తీసుకొచ్చిన తరువాత కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈడీ చర్యలు చట్టవిరుద్దమని పిటిషనర్లు వాదించారు. సీలింగ్ చెల్లదని ప్రకటించాలని, ఆస్తులను సీల్ చేయడానికి రద్దు చేయాలని కోరారు.
విచారణ సమయంలో ఈడీ తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్ వీ రాజు పాల్గొన్నారు. సోదాల సమయంలో ప్రాంగణాలను తాళం వేస్తే పీఎంఎల్ఏ కింద వాటిని సీల్ చేసే అధికారం ఏజెన్సీకి లేదని అంగీకరించారు.
ఈడీ అనుమతి లేకుండా ప్రాంగణాల తలుపులపై అతికించిన నోటీసులను ఉపసంహరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దర్యాప్తుకు సహకరించేలా నోటీసులు జారీ చేస్తామన్నారు. ఈ సందర్బంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. వ్యక్తుల ఆస్తులు ఉపయోగించడకుండా చేయడం ఏంటనీ ప్రశ్నించింది.
పీఎంఎల్ఏ అనేది అభివృద్ది చెందుతున్న చట్టమని జస్టిస్ రమేష్ వ్యాఖ్యానించారు. ఈడీ తరుచుగా చట్టపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. చట్టం అనుమతించిన దానికంటే తమ అధికారాలను వాడుతున్నారు. వ్యక్తుల ఇళ్లలోకి లేదా కార్యాలయాల్లోకి ప్రవేశించకుండా ఆపే నిబంధనల విషయంలో జస్టిస్ లక్ష్మీ నారాయణన్ ఈడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమేష్ ను ప్రశ్నించారు.
టాస్మాక్ మనీలాండరింగ్ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు నుంచి ఈ కేసు బయటకు వచ్చింది. పిటిషనర్లు భాస్కరన్, రవీంద్రన్ లను ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా పేర్కొనలేదు.
కానీ దర్యాప్తునుకు సంబంధించిన కీలక ఆధారాలు వారి వద్ద ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా సోదాలు చేసినట్లు తెలిపారు. మే 16న ఈడీ భాస్కరన్ కు చెందిన అల్వార్ పేట్ నివాసంలో సోదాలు నిర్వహించి, మూడు ఐఫోన్లు, ఒక ల్యాప్ టాప్, రెండు హర్డ్ డిస్క్ లు, ఒక హర్డ్ డ్రైవ్, అల్వార్ పేట, పోయేస్ గార్డెన్ లీజుకు సంబంధించిన ఆస్తుల లీజు ఒప్పందాలను స్వాధీనం చేసుకుంది.
అయితే టాస్మాక్ తో తమకు సంబంధం లేదని వారు వాదించారు. సోదాలను చట్టవిరుద్దంగా ప్రకటించి స్వాధీనం చేసుకున్న వస్తువులను తిరిగి ఇవ్వాలని భాస్కరన్ కోర్టును కోరారు.
తిరిగి ఇచ్చేయండి: కోర్టు
టాస్మాక్ దర్యాప్తుకు సంబంధించిన దర్యాప్తుకు మధ్య సంబంధాన్ని సమర్థించే పత్రాల సమర్పించడానికి, ప్రాంగణాలను సీల్ చేసే అధికారాలను బుధవారం వరకూ సమర్పించాలని ఆదేశించింది.
పీఎంఎల్ఏ కింద ఈడీకి కల్పించిన అధికారాలను న్యాయ వ్యవస్థ పరిశీలించాల్సిన అవసరాన్ని ఈ తీర్పు బలోపేతం చేసినట్లు కనిపిస్తోంది. ఆస్తులను సీల్ చేసే విషయంలో చట్టపరమైన నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఈ తీర్పు గట్టిగా చెబుతోంది.
పీఎంఎల్ఏ సెక్షన్ 17 కింద, 41 ఎఫ్ ఐఆర్ లు ఉన్నాయని, వాటికి ఆధారాలు ఉన్నాయనే వాదనలో డొల్లతనాన్ని కోర్టు గుర్తించింది. దర్యాప్తు సంస్థ బాధితుల నుంచి స్వాధీనం చేసుకున్న అన్ని వస్తువులు, ఆస్తులను తిరిగి వారికే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.


Read More
Next Story