‘‘తొక్కిసాలాటలో అసలు నిందితులెవరో అందరికి తెలుసు’’
x
బెంగళూర్ మాజీ పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు

‘‘తొక్కిసాలాటలో అసలు నిందితులెవరో అందరికి తెలుసు’’

బెంగళూర్ మాజీ పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు


అభిజిత్ సింగ్ భాంబ్రా

ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తరువాత చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది యువకులు మరణించారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తరువాత బెంగళూర్ నగర పోలీస్ కమిషనర్ బి. దయానంద, మరో నలుగురు పోలీస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో ఐపీఎస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే నెపంతో వీరిపై వేటు వేసింది.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శి కే. గోవిందరాజ్ కూడా సస్పెండ్ అయ్యాడు. కర్ణాటక అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఇంటలిజెన్స్) హేమంత్ నింబాల్కర్ కూడా బదిలీ చేసింది ప్రభుత్వం.
ఈ దుర్ఘటనకు అసలు వ్యక్తులను వదిలి పోలీసులను బలిపశువు చేశారని అనేక వర్గాల్లో చర్చ జరుగుతోంది. బెంగళూర్ మాజీ పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు ది ఫెడరల్ జర్నలిస్ట్ అభిజిత్ సింగ్ భాంబ్రా ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలను వెల్లడించారు.
జూన్ 4న బెంగళూర్ లో జరిగిన తొక్కిసలాటపై మీ స్పందన ఏమిటీ?
కర్ణాటక ప్రభుత్వం, బీసీసీఐ, ఐపీఎల్, ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజర్ డీఎన్ఏ 24 గంటల్లో విజయోత్సవ ర్యాలీ, విజయోత్సవ వేడుకలు నిర్వహించాలనే తొందరపాటు నిర్ణయం, ప్రణాళిక లేని, తప్పుడు ఆలోచన వలన ఈ దుర్ఘటన జరిగింది.
బెంగళూర్ పోలీసులు రాత్రంతా విధుల్లో ఉండటంతో అప్పటి చాలా అలసిపోయి ఉన్నారు. ఆటగాళ్లను అహ్మాదాబాద్ నుంచి చార్టర్డ్ విమానంలో తీసుకువచ్చి, ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంది, ఆపై నిషేధిత ప్రాంతంగా ఉన్న విధాన సౌధ మెట్లపై కవాతు నిర్వహించారు.
కేసీఏ స్టేడియంలో అభిమానలకు సత్కారం జరుగుతుండగానే అప్పటికే తొక్కిసలాట జరిగి మరణాలు సంభవించాయి. కానీ స్టేడియంలో మాత్రం ఆశ్చర్యకరంగా కార్యక్రమాలు కొనసాగాయి.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బయట అంగీకరించడం కంటే వెలుగులోకి రావడానికి యువతతో ఎక్కువ కనెక్ట్ కావడానికే ప్రాధాన్యం ఇచ్చారు. వారి చర్యలు పాలనను అపహస్యం చేయయడానికే ఇప్పుడు వారి చేతులకు రక్తం అటుకుంది.
కర్ణాటక పోలీసులకు ఇది చీకటి రోజని మీరు ట్వీట్ చేశారు. పోలీస్ కమిషనర్ బి దయానంద, ఇతరుల సస్పెన్షన్ అన్యాయం అని మీరు ఎందుకు భావిస్తున్నారు?
పోలీస్ కమిషనర్ ఒక మర్రిచెట్టులాంటివాడు. దాని కింద అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, ఏసీపీలు, ఇన్సెక్టర్ల వంటి అధికారులు పనిచేస్తారు. ఈ పదవి కేవలం పరిపాలనమైనది మాత్రమే కాదు. వ్యూహాత్మకమైనది, ప్రభుత్వంతో సంబంధించిన అనేక గోప్య నిర్ణయాలకు అమలు చేస్తుంది.
దయానంద అసమర్థుడని ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తే అది తన వైఫల్యంగా ప్రభుత్వం అంగీకరించినట్లే. నిజమైన దోషులెవరో అందరికి తెలుసు. తమ సొంత అధికారులను శిక్షించడం ద్వారా ప్రభుత్వంలో అధికారంలో ఉండటానికి తన సొంత సైనికులకు సమర్థవంతంగా నిర్మూలిస్తోంది.
దయానందను బలిపశువును చేశారని మీరు నమ్ముతున్నారా?
కేవలం చెప్పడమే కాదు. ఇది ఇప్పటికే జరిగింది. దయానంద, అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఏసీపీ, స్థానిక ఇన్స్పెక్టర్ లను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇంకా దారుణంగా కబ్బన్ పార్క్ ఇన్స్పెక్టర్ ఐపీఎల్, కేసీఏపై ఫిర్యాదు చేయవలసి వచ్చింది.
ఈ ఫిర్యాదు కోర్టులో నిలబడదు. ఇప్పటికే దోషిగా తేలిన వ్యక్తి విశ్వసనీయ ఎఫ్ఐఆర్ ఎలా దాఖలు చేయగలడు. ఇక్కడ చట్టపరమైన, రాజకీయ వ్యూహం లోపభూయిష్టంగా ఉంది.
అరెస్ట్ లు, ఎఫ్ఐఆర్ దృష్ట్యా మీరు నిజమైన పురోగతిని లేదా జవాబుదారీ తనాన్ని ఆశిస్తున్నారా?
వారం తరువాత అంతా మర్చిపోతారు. బాధిత కుటుంబాలు తప్ప. మీడియా దృష్టికి ఇది మంచి ఆసక్తికరమైన స్టోరీ. కానీ న్యాయం జరగదు. ప్రధాన దోషులు ఏ1, ఏ2 అంటే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా శిక్ష నుంచి విముక్తి పొందుతారు.
పదవీ విరమణ తరువాత మీరు నిష్కపటంగా మాట్లాడుతున్నారు? ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో మీరు చూస్తున్న కీలకమైన పాలనా వైఫల్యం ఏమిటీ?
కాంగ్రెస్ పార్టీ 224 సీట్లకు గాను 136 సీట్ల అఖండ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. వారు పెద్ద పెద్ద వాగ్ధానాలు చేశారు. ప్రజలు వాటిని నమ్మి ఓట్లు వేశారు. కానీ పాలనా వ్యవస్థ కుప్పకూలింది.
నేను 2013-2018 కాలంలో సిద్ధరామయ్య కింద పనిచేశాను. ఆయన నేటీ కంటే చాలా మంచి ముఖ్యమంత్రి అని నేను నమ్ముతున్నాను. కానీ ఆయన హమీ ఇచ్చిన పథకాలు చాలాపరిమితంగా అమలు చేస్తున్నారు. ఆయన ఆర్థిక మనస్తత్వం బట్టి ఆయన దీనికి మద్దతు ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను.
తొక్కిసలాట తరువాత ప్రభుత్వం ఏం చేసి ఉంటే బాగుండేది?
దర్యాప్తు చేయడానికి సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిని నియమించాలని ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఉండాలి. ఆ న్యాయమూర్తికి నెల నుంచి నెలన్నర వరకూ గడువు ఇచ్చి విచారణ పూర్తి చేయాలని, బాధ్యులను గుర్తించడానికి పూర్తి అధికారం, వనరులు ఇవ్వాలి. రాజకీయ జోక్యం లేకుండా చూసుకుంటూ, న్యాయవ్యవస్థ దాని పని అది చేసుకోనివ్వాలి.
ఇది కేవలం పోలీస్ కమిషనర్ గురించి మాత్రమే కాదని మీరు పేర్కొన్నారు. తెరవెనక ఏం జరిగింది?
పోలీసు వ్యవస్థలో ఎవరో ఒక మంత్రిని తీసుకుని ఉద్యోగంలో నిలవలేరు. కమిషనర్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి అంతా కలిసే పనిచేయాలి. కానీ స్టేడియం లోపల సెల్పీలు, కోలాహాలం తరువాత బయట ఉన్నవారిని వదిలేశారు. విరాట్ కోహ్లీ బృందంతో ఉన్న ఫొటోలకు ప్రాధాన్యం లభించింది. ఇంతలో గేట్ల బయట ప్రజలు చనిపోతున్నారు. కానీ నింద మాత్రం పోలీసుల పైకి నెట్టేశారు.
ఒక సీనియర్ అధికారిని బలి ఇవ్వడం పోలీస్ నైతికతను దెబ్బతీస్తుందా?
కచ్చితంగా జరుగుతుంది. ఇది శాఖ స్ఫూర్తిని విచ్చిన్నం చేస్తుంది. అధికారలు లంగరు లేనివారు, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడనివారు అవుతారు. పోలీస్ పనికి తక్షణ నిర్ణయాలు అవసరమని నేను ఎప్పుడూ నా కింది అధికారులకు చెప్పేవాడిని. సానియా మీర్జా లేదా విరాట్ కోహ్లీలాగా మన తప్పులు తక్షణమే కనిపిస్తాయి.
న్యాయమూర్తులు లేదా ఐఏఎస్ అధికారుల తప్పుడుల బయటపడటానికి సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఒక పోలీస్ అధికారి తప్పు చేస్తే అది క్షణాల్లో బయటపడుతుంది. మనం త్వరగా ఉండాలి. మనం సరైన వారమై ఉండాలి. మాకు మద్దతు అవసరం.. ద్రోహం కాదు.
అంత పెద్ద జనసమూహానికి సిద్దం కావడానికి పోలీసులకు తగినంత సమయం లేదా వనరులు అందాయా?
స్పష్టంగా తెలియదు. మొత్తం కార్యక్రమం తొందరపాటుతో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల మధ్య జరిగిన పోరాటంలో పోలీసులు కష్టాలు అనుభవించారు.


Read More
Next Story