
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఈపీఎస్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
డీలిమిటేషన్, ప్రభుత్వ వ్యతిరేకతా.. ఎవరిది పైచేయి అవుతుంది?
తమిళనాడు రాజకీయాలను ఈ రెండు అంశాలే శాసించబోతున్నాయా?
మహాలింగం పొన్నుస్వామి
వచ్చే ఏడు ప్రారంభంలోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో అధికార విపక్షాలు రెండు అంశాల చుట్టే తమ రాజకీయాలను కేంద్రీకరించి లాభం పొందాలని చూస్తున్నాయి.
ముఖ్యంగా డీలిమిటేషన్ అంశాన్ని ప్రాంతీయ మనోభావాల అంశం పరిధిలోకి తీసుకొచ్చి, వరుసగా రెండో సారి గెలవాలని డీఎంకే వ్యూహాలు రచిస్తోంది.
డీలిమిటేషన్ తమిళనాడు పార్లమెంటరీ ప్రాతినిధ్యానికి ముప్పుగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చాలాకాలంగా అభివర్ణిస్తున్నారు. ఈ విషయం జనం నోళ్లలో నానేలా చేస్తున్నారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కడానికే డీలిమిటేషన్ పై నిర్ణయాలు తీసుకుంటున్నారని, కుట్రలు చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు.
అయితే ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీ మాత్రం దీనిని కొట్టిపారేస్తోంది. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలా ప్రజలలో భయాన్ని పుట్టిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
డీలిమిటేషన్ ప్రమాదకరం..
2027 జనాభా లెక్కల తరువాత తమిళనాడు సహ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయం సాధించినందుకు జరిమాన విధించబోతున్నారని, ఉత్తరాది రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్ల సంఖ్య పెరుగబోతోందని స్టాలిన్ వాదిస్తున్నారు.
వెంటనే ఈ నిర్ణయాలకు వాయిదా వేయాలని కోరుతున్నారు. తనకు తానే తమిళనాడు ప్రయోజనాల రక్షకుడిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
‘‘బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఈపీఎస్ తమిళనాడుకు ద్రోహం చేశారు. రాష్ట్రానికి నష్టం కలిగించే వారితో చేతులు కలిపారు. ఢిల్లీ ఆధిపత్యానికి లొంగిపోయారు’’ అని స్టాలిన్, మాజీ సీఎం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపై ఆరోపణలు గుప్పించారు.
డీలిమిటేషన్ ను వ్యతిరేకించడానికి డీఎంకే తన లౌకిక ప్రగతిశీల కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, విదుతలై చిరుతైగల్ కచ్చి(వీసీకే) లతో ఒక కూటమిని ఏర్పాటు చేసింది.
వ్యతిరేకుల ప్రచారం..
అయితే స్టాలిన్ తన పాలనలోని వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించడానికే డీలిమిటేషన్ ముందుకు తెచ్చారని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అవినీతి కుంభకోణాలు, శాంతి భద్రతల సమస్య తమిళ ప్రజలను వేధిస్తోందని దీనిని కప్పిపుచ్చడానికి భయాన్ని ముందుకు తెస్తున్నారని ఆరోపించారు.
‘‘ముఖ్యమంత్రి అవినీతి, వంశపారంపర్య పాలనకు అధ్యక్షత వహిస్తున్నారు. అందుకే న్యాయమైన డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు. ముందుగా టాస్మాక్ దోపిడి, మాదక ద్రవ్యాల మాఫియాలో మీ కుటుంబ అహంకారాన్ని డీలిమిట్ చేయండి’’ అంటు చురకలు అంటించారు.
మద్యం, ఇసుక తవ్వకాలు, ఉద్యోగాలు ఇస్తామని నగదు తీసుకోని మోసం చేయడం వంటి పలు ప్రశ్నలను ఆయన డీఎంకేపై సంధించారు. 2026 లో అన్నాడీఎంకే ఎన్నికైతే తమిళనాడు పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని కాపాడుకుంటుందని ఆయన హమీ ఇచ్చారు.
డీఎంకే చేస్తున్న ప్రచారాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తోసిపుచ్చారు. డీఎంకే తన పాలనా వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ కే. అన్నామలై మాట్లాడుతూ.. సీఎం ముల్ల పెరియార్, కావేరి జల వివాదాలపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు.
2025 ఏప్రిల్ లో అన్నాడీఎంకే- బీజేపీ కూటమి లో చేరింది. డీఎంకే పై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఇది ఏర్పాటు అయింది. ఏఐడీఎంకే ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా ఈపీఎస్ తమిళనాడులో ఎన్డీఏకు నాయకత్వం వహిస్తారని అమిత్ షా ధృవీకరించారు.
అయితే అన్నాడీఎంకేలో ఇంకా అంతర్గత ఘర్షణలు సద్దుమణగలేదు. బీజేపీతో సైద్దాంతిక విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హిందీ భాషను రుద్దడం, సమాఖ్యవాదం వంటి అంశాలు ఓ వర్గం తమిళ ఓటర్లను ఈ పార్టీకి దూరం చేసే అవకాశం ఉంది.
విజయ్ ఎటువంటి ప్రభావం చూపుతాడో..
తమిళ నటుడు విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి వచ్చి తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. యువతలో ఆయనపై విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన ఆ మేరకు ఓట్లను చీల్చవచ్చు.
ఇది డీఎంకేకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. జనాభా ఆధారిత డీలిమిటేషన్ లోపభూయిష్టంగా ఉందని, తమిళనాడు ప్రాతినిధ్యాన్ని తగ్గించవచ్చని, అయితే చెన్నై లాంటి మహానగరాల్లో ఎంపీ సీట్లు మూడు నుంచి ఆరుకు పెరుగుతాయని సీనియర్ జర్నలిస్ట్ సావిత్రి కన్నన్ డీఎంకే వైఖరికి మద్దతు ఇచ్చారు.
‘‘డీఎంకే విధానం సరైనది. ఈపీఎస్ మాటలు బీజేపీ నుంచి వచ్చినవి.’’ అని ఆయన అన్నారు. డీఎంకే ఈ ముప్పును ఓటర్లకు ఎంత సమర్థవంతంగా తెలియజేస్తుందనే దానిపై దాని విజయం ఆధారపడి ఉంది. తమిళ గుర్తింపుపై దాడిగా డీలిమిటేషన్ రూపొందించే బలమైన ప్రచారం బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తుందని కన్నన్ విశ్వసిస్తున్నారు.
కచ్చతీవు, కావేరి హక్కుల వంటి హమీలను నెరవేర్చడంలో తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి డీఎంకే అనసర భయాలను ప్రచారం చేస్తోందని అన్నాడీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి రాజసత్యన్ ఆరోపించారు.
‘‘నాలుగు సంవత్సరాలలో డీఎంకే, అన్నాడీఎంకే పథకాలను కాపీ కొట్టి క్రెడిట్ తీసుకోవడం తప్ప ఏమిసాధించలేదు. బీజేపీతో మా పొత్తు మా విధానాలు, సూత్రాలకు రాజీపడకుండా, నిధులు, ప్రాజెక్ట్ లు పొందడం వ్యూహత్మకమైనది’’ అని ఆయన అన్నారు.
గ్రౌండ్ జీరో ఇంపాక్ట్ ఎంత?
2026 ఎన్నికల డీలిమిటేషన్ చర్చ ప్రభావం పార్టీలు ఓటర్ల అవగాహాన ఎలా రూపొందిస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుందని కన్నన్ అన్నారు. ‘‘ఉత్తర - కేంద్రీకృత’’ ప్రభావం బీజేపీకి వ్యతిరేకంగా తమిళ ప్రైడ్ కు రక్షకుడిగా డీఎంకే వ్యూహం.
సాంస్కృతిక, రాజకీయ వేధింపులను ప్రతిఘటించిన చరిత్ర తమిళనాడుకు ఉంది. హిందీని విధించడం, నీట్, డీలిమిటేషన్ వంటి అంశాలను డీఎంకే విజయవంతంగా సమీకరించుకుని 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 39 ఎంపీ సీట్లను తన ఖాతాలో వేసుకుంది.
అయితే డీఎంకే అవినీతి, పాలనా వైఫల్యాలపై దృష్టిసారించి అధికార వ్యతిరేకతను విజయవంతంగా హైలైట్ చేస్తే అన్నాడీఎంకే- బీజేపీ కుటమికి ఆదరణ దక్కుతుంది. 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ఉండే 84 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ ప్రభావాన్ని చూపించి ఉండేవని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.
అయినప్పటికీ బీజేపీతో పొత్తు వల్ల హిందూత్వాన్ని వ్యతిరేకించే ఓటర్లు అన్నాడీఎంకేకు దూరం జరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. ఇక్కడ ప్రభావం కనిపించవచ్చు.
విజయ్ టీవీకే ఇప్పటికే వైల్డ్ కార్డుగా ఉంది. అది యువత, సాంప్రదాయ ఓటు బ్యాంకులను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ద్రవిడ దిగ్గజాలకు కొత్త ప్రత్యామ్నాయంగా తనను తాను నిలబెట్టుకుంటే. రాజకీయ విశ్లేషకుడు రాము మణివన్నన్ అభిప్రాయం ప్రకారం.. ‘‘బీజేపీ వ్యతిరేక కథనం ఆధిపత్యం చెలాయిస్తే అది డీఎంకేకు ప్రయోజనం. కానీ అన్నాడీఎంకే- బీజేపీ స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తే వారు స్టాలిన్ ఇంటి ముఖం పట్టించవచ్చు’’ అని విశ్లేషించారు.
Next Story