
రోహింగ్యాలు, బంగ్లాదేశీయులపై యూపీ పోలీసుల దృష్టి
అక్రమ వలసదారుల కోసం ప్రత్యేక డ్రైవ్
అక్రమ వలసదారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు సహ ఇతర అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకుని వారణాసి పోలీస్ కమిషనరేట్ వారం రోజుల పాటు ప్రత్యేక ధృవీకరణ డ్రైవ్ ను ప్రారంభించిందని అధికారులు తెలిపారు.
తాత్కాలిక స్థావరాలలో నివసిస్తున్న అనేకమంది ఎలాంటి పత్రాలు లేకుండా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. వీరిని గుర్తించడానికి వారణాసి అంతటా బృందాలను మోహరించినట్లు కాశీ జోన్ డిప్యూటీ కమిషననర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) గౌరవ్ బన్స్యాల్ తెలిపారు.
శనివారం ప్రారంభమైన వారం రోజుల ప్రచారం, అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి, సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన అన్నారు.
‘‘ఏడు రోజుల ధృవీకరణ ప్రచారంలో, పోలీసు బృందాలు గుడిసె సమూహాలను, రోడ్డు పక్కన నివసిస్తున్న వారిని తనిఖీ చేస్తున్నాయి. ధృవీకరణ తరువాత చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు గుర్తించిన వ్యక్తులు నిబంధనల ప్రకారం కఠినమైన, ప్రభావవంతమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని బన్స్యాల్ చెప్పారు.

