
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
‘‘పాక్ దుర్మార్గ దేశం, దాని అణ్వాయుధాలను అదుపులోకి తీసుకోవాలి’’
ఐఏఈఏను కోరిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇక ప్రాయోజిత ఉగ్రవాదాన్ని యుద్ధంగా పరిగణిస్తామన్న కేంద్రమంత్రి
పాకిస్తాన్ లోని అణ్వాయుధాలను వెంటనే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అదుపులోకి తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ కోరారు. పాకిస్తాన్ ఓ దుర్మార్గ దేశమని ఇక్కడ అణు ఆయుధాలు సురక్షితంగా లేవని అన్నారు.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు చేసిన తరువాత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం జమ్మూకాశ్మీర్ ను సందర్శించారు.
జమ్మూకాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి ఆయన సైన్యం సంసిద్దతను సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాలలో పాకిస్తాన్ షెల్స్ వేయడం వల్ల కలిగే నష్టాన్ని కూడా రక్షణ మంత్రి పరిశీలించారు.
పోకిరి రాష్ట్రం..
బాదామీ బాగ్ కంటోన్మెంట్ ను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన సందేశాన్ని ఇచ్చారన్నారు. పాకిస్తాన్ ప్రవర్తన దుర్మార్గ దేశాన్ని పోలీ ఉందన్నారు. కాబట్టి అణ్వాయుధాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) పరిధిలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
‘‘మన సైన్యం లక్ష్యం కచ్చితమైనదని, ప్రపంచానికి తెలుసు. వారు లక్ష్యాన్ని చేధించినప్పుడూ, వారు లెక్కింపును(ఉగ్రవాదుల) శత్రువులకు వదిలివేస్తారు. నేడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసిన ప్రతిజ్ఞ ఎంత బలంగా ఉందో వారి అణ్వాయుధ బ్లాక్ మెయిల్ ను కూడా మనం పట్టించుకోలేదని వాస్తవం నుంచి తెలుసుకుంది. పాకిస్తాన్, భారత్ ఎంత బాధ్యతారహితంగా బెదిరించిందో ప్రపంచం మొత్తం చూసింది.
ఈ రోజు శ్రీనగర్, భూమి నుంచి ఇంత బాధ్యతారహితమైన, మోసపూరిత దేశం చేతుల్లో అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయా అనే ప్రశ్నను నేను లెవనెత్తాలనుకుంటున్నాను. పాకిస్తాన్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలోకి తీసుకోవాలని నేను నమ్ముతున్నాను’’ అని ఆయన అన్నారు.
జవాన్ల ధైర్యం, త్యాగం..
‘‘ఉగ్రవాదం, ఉగ్రవాదులతో పోరాడిన ధైర్యవంతులైన జవాన్ల అత్యున్నత త్యాగానికి నేను నమస్కరిస్తున్నాను. వారి జ్ఞాపకాలకు నేను నివాళులర్పిస్తున్నాను’’ అని రాజ్ నాథ్ సింగ్ సాయుధ దళాల ధైర్య త్యాగాలను కొనియాడారు.
‘‘పహల్గామ్ లో మరణించిన అమాయక పౌరులకు నేను గౌరవం ఇస్తున్నాను. గాయపడిన సైనికుల పరాక్రమానికి నేను సెల్యూట్ చేస్తున్నాను. వారు వీలైనంత త్వరగా కోలుకోవడానికి దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.
భారత్ ఎదురుదాడి చేస్తుంది..
భారత్ ఇకపై ఏదైన ఉగ్రవాద లేదా పాక్ ప్రాయోజిత దాడులను ‘యుద్దచర్య’గా తీసుకుని ప్రతిస్పందిస్తుందని, పాకిస్తాన్ కు సంబంధించిన అన్ని విషయాలకు ఇది కొత్త విధానంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఉగ్రవాదం, పీఓజేకే పై మాత్రమే దృష్టి సారించకపోతే పాకిస్తాన్ తో ఎటువంటి చర్చలు ఉండవని రాజ్ నాథ్ పేర్కొన్నారు.
Next Story