
రాజ్యసభలో మాట్లాడుతున్న నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీలు
జమ్మూకశ్మీర్ సీఎంకు అధికారాలు లేవు: ఎంపీలు
ఏం చేయాలన్నా లెప్టినెంట్ గవర్నర్ వద్దకే వెళ్లాల్సి వస్తోందన్న రంజాన్, కిచ్లూ, రాష్ట్ర హోదా పునరుద్దరించాలని విన్నపం
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ లో అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి ఆ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించే అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) సహ ప్రతిపక్షాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
దీనిపై ఇంటాబయట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ఎంపీలు రాజ్యసభలో రాష్ట్ర హోదా కల్పించే అంశాన్ని లేవనెత్తారు.
దాదాపు ఐదు సంవత్సరాలు విరామం తరువాత జేకే అసెంబ్లీకి ఎన్నికలు జరగడంతో అక్కడి నుంచి రాజ్యసభకు కూడా సభ్యుల ఎన్నిక జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ అరంగ్రేట ఎంపీలు చౌదరి మొమహ్మద్ రంజాన్, సజ్జాద్ అహ్మద్ కిచ్లూ రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ కు చేసిన అభినందన ప్రసంగంలో జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్దరణ అంశం కూడా జతచేశారు.
వేరే సందర్భం అని చెప్పినప్పటికీ..
రాజ్యసభ చైర్మన్ అయిన సీపీ రాధాకృష్ణన్ రాష్ట్ర హోదా అంశాన్ని వేరే సందర్భంలో మాట్లాడాలని గౌరవ సభ్యులకి తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్నికైన ప్రభుత్వానికి అసలు అధికారాలు లేవని, అన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన లెప్టినెంట్ గవర్నర్(మనోజ్ సిన్హా) దగ్గరే ఉన్నాయని చెప్పారు.
‘‘ప్రభుత్వానికి అధికారం లేకపోతే ప్రజలకు ఏం లాభం. ప్రభుత్వం చేతిలో ఏమి ఉండదు. అన్ని అధికారాలు కేవలం లెప్టినెంట్ గవర్నర్ కే ఉంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రం సరిహద్దు రాష్ట్రం.
గత దశాబ్ధంలో జమ్మూకశ్మీర్ లో ఏం జరిగిందో మీకు తెలుసు. తిరిగి దానిని బలోపేతం చేయాలి. జమ్ముకశ్మీర్ ప్రజలు తిరిగి ఆ ఆదేశాన్ని ఇచ్చారు. చేతిలో అధికారం లేకుండా ప్రజలకు ఏం చేయలేము’’ అని రంజాన్ అన్నారు.
తరువాత మాట్లాడిన కిచ్లూ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 2019 లో ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూకశ్మీర్ కు తొలగించిన రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్దరిస్తామని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ కు హమీ ఇచ్చారని కిచ్లూ గుర్తు చేశారు.
జేకే సీఎం ఒమర్ ఏమన్నాడంటే..
రాష్ట్ర హోదా అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదని, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలోని ఎంపీలు కూడా ఏం మాట్లాడటం లేదని కాంగ్రెస్, పీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
దీనితో నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీలు కూడా తప్పనిపరిస్థితులలో పార్లమెంట్ లో ఈ విషయం లేవనెత్తి ఉంటారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నిన్న ఉదయం పార్లమెంట్ కి వచ్చారు. ఇద్దరు ఎంపీలు మాట్లాడిన క్లిప్పులను పార్టీ నాయకత్వం కూడా ఎక్స్ లో షేర్ చేసింది. ఇవి నేషనల్ కాన్పరెన్స్ కు నిబద్దతకు నిదర్శనంగా ఒమర్ తన సామాజిక మాధ్యమం ఖాతాలో ప్రశంసించారు.
‘‘మొదటి రోజు మొదటి ప్రదర్శన. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్దరణ గురించి కేంద్ర ప్రభుత్వం తన వాగ్ధానాన్ని గుర్తు చేయడానికి అందుబాటులో ఉన్న మొదటి అవకాశాన్ని ఉపయోగించుకున్నా రాజ్యసభలో పార్టీ నాయకుడు మహమ్మాద్ రంజాన్ కు శుభాకాంక్షలు’’ అని ఒమర్ అబ్ధుల్లా ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఆయన తన పోస్ట్ లో రంజాన్ మాట్లాడిన కొన్ని భాగాలను పంచుకున్నారు. కిచ్లూ మాట్లాడిన మాటలను కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘దయచేసి జేకే సమస్యలను సమర్థిస్తూ, మా హక్కుల కోసం పోరాడుతూ ఉండండి’’ అన్నారు.
బుడ్గావ్ ప్రభావం..
రాజ్యసభలో లభించిన తొలి అవకాశంలోనే రాష్ట్ర హోదా అంశాన్ని లేవనెత్తాలని ఎన్సీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2021 నుంచి జేకేకి ఎగువ సభలో ఏ ప్రతినిధి లేరు. ఎందుకంటే రాజ్యసభకు సభ్యులు ఎన్నిక కావాలంటే అసెంబ్లీ ఉండాలి.
అయితే ఆ ప్రాంతానికి సభ ఉనికిలో లేదు. బుద్గాం అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఓడిపోయిన తరువాత ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. బుద్గామ్ ముఖ్యమంత్రి అంతర్గత సహయకుడు రుహుల్లా మెహదీకి బలమైన కోట. అక్కడే పార్టీ ఓడిపోయింది.
అయితే తనకు రాజకీయ ద్రోహం జరిగిందని మెహదీ, సీఎం పైనే విమర్శలు గుప్పిస్తున్నాడు. ఎన్ సీ మిత్రపక్షమైన కాంగ్రెస్ ప్రజలతో రాష్ట్ర హోదా అంశంపై నేరుగా చర్చించడానికి ‘‘హుమారీ రియాసత్ హుమారా హక్’’ ప్రచారంతో పాటు ఘర్ ఘర్ దస్తక్, హర్ ఘర్ దస్తక్ ప్రచారం ప్రారంభించింది.
కాంగ్రెస్ ఉదాసీనత..
గతవారం జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా, శాసన సభ పార్టీ నాయకుడు గులాం అహ్మద్ మీర్, మాజీ పీసీసీ చీఫ్ వికార్ రసూల్ వానీ పార్టీ ఆర్గనైజషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పార్టీ జమ్మూ కశ్మీర్ డెస్క్ ఇంచార్జ్ సయ్యద్ నసీర్ హుస్సేన్, అతని డిప్యూటీ దివ్య మదేర్నా పర్గత్ సింగ్ లను కలిసి యూటీలో కాంగ్రెస్ భవిష్యత్ రోడ్ మ్యాప్ గురించి చర్చించారు.
అబ్దుల్లా పార్టీ తన మిత్రపక్షమైన జమ్మూ కశ్మీర్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ ప్రతినిధిగా పంపాలని అనుకున్నప్పటికీ అది వీలుకాలేదు. దీనితో ఎన్సీ కాంగ్రెస్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ పార్టీ సపోర్టు లేకుండా ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
వేణుగోపాల్ తో జరిగిన చర్చల గురించి తెలిసిన వర్గాలు ది ఫెడరల్ కు తెలిపిన వివరాల ప్రకారం.. పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో రాష్ట్ర హోదా అంశాన్ని బలవంతంగా లేవనెత్తాలని జమ్మూకశ్మీర్ నాయకులు పార్టీ హైకమాండ్ ను వేడుకున్నారు.
ఆగష్టులో ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్దరించాలని కోరుతూ మోదీకి లేఖ రాశారు.
ఆ సమయంలో కాంగ్రెస్ చొరవను ఎన్సీ స్వాగతించింది. కానీ ఇప్పుడు తీరిగ్గా నేషనల్ కాన్ఫరెన్స్ దానిని లేవనెత్తిందని కాంగ్రెస్ విమర్శించింది. ప్రస్తుత శీతకాల సమావేశాలలో సర్ పై విపక్షాలు బిజీగా ఉండటంతో, మిగిలిన రోజుల్లో జేకేపై ప్రశ్నలు లేవనెత్తుతారా లేదా అని చూడాలి.
Next Story

