
‘‘జేకే రిజిస్ట్రేషన్ వాహనం తీయాలంటే భయంగా ఉంది’’
కొంతమంది చేసిన పనికి అందరిపై అనుమానపడుతున్నారన్నా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్ధుల్లా
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడి తరువాత జమ్మూకశ్మీర్ ప్రజలు కేంద్రపాలిత ప్రాంతం దాటి ప్రయాణించడానికి భయపడుతున్నారని ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా బుధవారం అన్నారు.
కొద్దిమంది కశ్మీరీ ప్రజలు చేసిన అకృత్యాలు మిగిలిన వారిపై అనుమానం పెంచాయని అన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపడానికి ఇష్టపడకపోవచ్చు.
అన్నివైపుల నుంచి మనల్నీ అనుమానాస్పద దృష్టితో చూస్తున్నారు. వేరొకరు మనల్ని అప్రతిష్ట పాలుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనం ఇప్పుడు బయటకు వెళ్లడం కష్టమవుతుందని స్పష్టంగా తెలుస్తుంది’’ అని దక్షిణ కశ్మీర్ లోని కుల్గాంలో జరిగిన ఒక కార్యక్రమంలో అబ్దుల్లా అన్నారు.
కానీ మనం ఏమి చేయగలం, అదే వాస్తవం అని అన్నారు. ‘‘ఢిల్లీ ఎర్రకోట పేలుడులో కొంతమంది బాధ్యులు, కానీ దానికి మనమందరం కారణమనే భావనను సృష్టిస్తున్నారు.
మనమందరం దానిలో భాగమే’’ అని ఆయన అన్నారు. దేశ రాజధానిలో జేకే రిజిస్ట్రేషన్ ఉన్న తన వాహానాన్ని బయటకు తీసుకెళ్లే ముందు రెండుసార్లు ఆలోచిస్తానని అబ్ధుల్లా అన్నారు.

