రాజకీయ నాయకులే జస్టిస్ శేఖర్ యాదవ్ ను రక్షిస్తున్నారా?
x

రాజకీయ నాయకులే జస్టిస్ శేఖర్ యాదవ్ ను రక్షిస్తున్నారా?

గత ఏడాది వీహెచ్పీ సమావేశంలో ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి


విశ్వహిందూ పరిషత్ కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్ ఓ వర్గానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేసి ఆరు నెలల అవుతోంది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసిన, ప్రతిపక్ష ఎంపీలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ ఎటువంటి చర్యలు ఇప్పటి వరకూ తీసుకోలేదు. న్యాయపరమైన దుష్ఫ్రప్రవర్తనను విషయంలో ద్వంద్వ ప్రమాణాలను ఈ కేసు హైలెట్ చేస్తుంది.

వివాదాస్పద వ్యాఖ్యలు...
గత ఏడాది డిసెంబర్ 8న జస్టిస్ యాదవ్ భారత్ లోని మెజారిటీ పాలన అవసరం గురించి వీహెచ్పీ నిర్వహించిన సెమినార్ లో ప్రసంగించారు. ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగంగా విస్తృతంగా భావించిన వ్యాఖ్యలను చేశారు. అలహాబాద్ హైకోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం తరువాత ఆగ్రహం రేకేత్తించింది.
‘‘ఆయన వ్యాఖ్యలు.. మరేదైనా సందర్భంలో అది న్యాయమూర్తి కాకపోతే ద్వేషపూరిత ప్రసంగం కేసు నమోదు అయి ఉండేది.’’ అని పునీత్ నికోలస్ యాదవ్ తన విశ్లేషణలో పేర్కొన్నారు. అయినప్పటికీ ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.
నిలిచిపోయిన అభిశంసన ప్రక్రియ..
డిసెంబర్ లో యాభై ఐదు మంది రాజ్యసభ ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే మార్చిలో రాజ్యసభ సెక్రటేరియట్ సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. ఈ విషయం ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ ఖడ్ పరిశీలనలో ఉందని పేర్కొంటూ సమాంతర విచారణ నిలిపివేయాలని కోరింది.
ఆరు నెలల తరువాత ఏం జరిగింది..
ఎలాంటి విచారణ ప్రారంభం కాలేదు. సంతకం ధృవీకరణ అసంపూర్తిగా ఉంది. వర్షాకాల సమావేశాలు స్పష్టత లేకుండానే వస్తున్నాయి. ఇక్కడ ఒక స్పష్టమైన పోలిక కనిపిస్తుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ కేసుతో ఈ కేసు పూర్తిగా భిన్నంగా ఉంది.
మార్చి14న నగదు రికవరీ అయింది. మే 3 నాటికి సుప్రీంకోర్టు విచారణ పూర్తయింది. మే 8న నాటికి రాష్ట్రపతికి నివేదిక చేరింది. ఈ కేసును దాదాపు జెట్ వేగంతో పూర్తి చేశారు. కానీ అంతకుముందు మాట్లాడిన జస్టిస్ శేఖర్ యాదవ్ కేసు మాత్రం ముందుకు సాగట్లేదు.
‘‘జస్టిస్ వర్మ కేసులో అలాంటి జోక్యం జరగనప్పుడూ, రాజ్యసభ చైర్మన్ ఒక కేసులో సుప్రీంకోర్టు విచారణను ఎందుకు నిలిపివేశారు’’? అని యాదవ్ సంధిస్తున్న ప్రశ్న.
రాజకీయంగా రక్షణ లభిస్తుందా?
జస్టిస్ యాదవ్ త్వరలో పదవీ విరమణ చేస్తున్నారు. సమయం మించిపోతోంది. పాలక వర్గంతో ఆయనకు సైద్దాంతిక పొత్తు ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకోవడానికి ఆలస్యం చేస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
‘‘జస్టిస్ యాదవ్ ఈ రోజు అధికార పార్టీతో సంబంధం ఉన్న వీహెచ్పీ నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకావడం వలనా? అని ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రమాదంలో జవాబుదారీతనం..
ఈ కేసు అనేక ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తుతోంది. న్యాయమూర్తులకు ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయా? రాజకీయ నాయకగణం న్యాయ జవాబుదారీతనాన్ని ప్రభావిత చేస్తోందా? జస్టిస్ యాదవ్ పదవీ విరమణకు ముందు వ్యవస్థ చర్య తీసుకోగలదా.
జూలై 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో అభిశంసన తీర్మానం ముందుకు సాగుతుందా లేదా వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తావించబడకుండా పోతాయా అనే దానిపై అందరి దృష్టి ఉంది.


Read More
Next Story