
అబ్బాస్ అన్సారీ
యూపీ అసెంబ్లీ నుంచి డిస్ క్వాలిఫై అయిన అబ్బాస్ అన్సారీ
ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులపై బహిరంగ బెదిరింపులు దిగిన ఫలితం
గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ముఖ్తార్ అన్సారీ కుమారుడు, యూపీ ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీపై అనర్హత వేటుపడింది. ద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేలిన తరువాత ఉత్తరప్రదేశ్ శాసనసభ అనర్హుడిగా ప్రకటించింది. అబ్బాస్ అన్సారీ మౌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ స్థానం ఇప్పుడు ఖాళీగా ఉందని శాసనసభ వర్గాలు పీటీఐకి తెలిపాయి.
2022 నాటి ద్వేషపూరిత ప్రసంగం కేసులో సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ) ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీకి ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం రెండేళ్ల జైలుశిక్ష విధించింది.
ప్రాసిక్యూషన్ ప్రకారం.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మౌ సదర్ స్థానం నుంచి ఎస్బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అబ్బాస్ అన్సారీ మార్చి 3, 2022 న పహర్ పూర్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో మౌ పరిపాలన వ్యవస్థను బెదిరించాడు.
ఎన్నికల తరువాత వారందరికి గట్టి గుణపాఠం నేర్పుతానని బెదిరించారు. దీనితో అన్సారీపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 189( ప్రభుత్వ ఉద్యోగుల బెదిరింపు), 153-ఏ(మతం, కులం, జన్మస్థలం, నివాసం, భాష ఆధారంగా వివిధ సమూహల మధ్య శత్రుత్వం ప్రొత్సహించడం, సామరస్యాన్ని చెడగొట్టడం) 171ఎఫ్( ఎన్నికలలో అనవసర ప్రభావం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేసినట్లు డిఫెన్స్ న్యాయవాదీ దరోగా సింగ్ పిటీఐకి చెప్పారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం శనివారం అబ్బాస్ ను దోషిగా నిర్ధారించి సెక్షన్ 189, 153- ఏ కింద రెండు సంవత్సరాలు, సెక్షన్ 506 కింద ఒక సంవత్సరం, సెక్షన్ 171- ఎఫ్ కింద ఆరునెలల జైలు శిక్ష విధించారని సింగ్ తెలిపారు. అన్ని శిక్షలు ఒకేసారి అమలు అవుతాయని, అన్సారీకి రూ. 2వేల జరిమానా కూడా విధింస్తున్నట్లు న్యాయమూర్తి కేపీ సింగ్ తీర్పు చెప్పారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కోర్టు ఒక సభ్యుడిని రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించినట్లు అయితే శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే నిబంధన ఉంది.
2022 లో సమాజ్ వాదీ నేతృత్వంలోని కూటమి కింద ఆయన పార్టీ తరఫున తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఎస్బీఎస్పీ ప్రస్తుతం బీజేపీతో చెలిమి చేసి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు.
అంతకుముందు అబ్బాస్ అన్సారీ తండ్రి రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ, మౌసదర్ స్థానం నుంచి చాలాకాలం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. బందా జిల్లా జైలులో ఉన్న ముక్తార్ అన్సారీ 2024 మార్చిలో ఉత్తరప్రదేశ్ లోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు.
Next Story