మాలివాల్: ఒకప్పుడు నిర్భయకు రక్షణగా.. ఇప్పుడేమో నిందితుడికి భాసటగా..
x

మాలివాల్: ఒకప్పుడు నిర్భయకు రక్షణగా.. ఇప్పుడేమో నిందితుడికి భాసటగా..

ఆప్ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్ సొంత పార్టీకి పై విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు నిర్భయ కోసం రక్షణగా నిలబడ్డారని, ఇప్పుడు నిందితులకు భాసటగా ఉన్నారని..


ఒకప్పుడు నిర్భయకు న్యాయం చేయడానికి ఆప్ పార్టీ రోడ్లకు మీదకు వచ్చిందని, ఇప్పుడు అదే ఆప్ మహిళపై దాడికి పాల్పడి, నిందితులకు రక్షణగా నిలబడిందని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ అన్నారు.

ఒకప్పుడు నా సహచరులు నిర్భయకు న్యాయం చేయడానికి పిలుపునిచ్చారని, 12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ను ఇరికించేందుకు బీజేపీ, స్వాతి మాలివాల్ ను ఉపయోగించుకుంటుందనే వాదనలను ఖండించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాంలో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా బయట ఉంటే ఈ అవమానం జరిగేది కాదని అన్నారు.
మే 13న కేజ్రీవాల్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన తనపై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని మలివాల్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆమె ఆరోపణలను తోసిపుచ్చింది.
ఆప్ పార్టీ ప్రారంభం నుంచి దానితోనే ఉన్న మల్లివాల్ ఆదివారం నాడు మాట్లాడుతూ ‘‘ ఈ నిర్భయ కోసం ఆప్ మరోసారి రోడ్లకు మీదకు రావాల్సి ఉంది’’ అని అన్నారు. “ 12 సంవత్సరాల తరువాత, సిసిటివి ఫుటేజీని అదృశ్యం చేసి, ఫోన్‌ను ఫార్మాట్ చేసిన నిందితుడిని (బిభవ్ కుమార్) రక్షించడానికి మేము(ఆప్) వీధుల్లోకి వచ్చాము? మనీష్ సిసోడియా జీ కోసం వారు ఇంత బలాన్ని ఉపయోగించలేదు. అలా ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను. అతను ఇక్కడ ఉండి ఉంటే. , బహుశా విషయాలు నాకు ఇలా జరిగేవి కావు!" మల్లివాల్ వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజుల పాటు కోర్టు అతడికి జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.
ఢిల్లీ పోలీసుల ప్రకారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దగ్గర తొమ్మిది సంవత్సరాల నుంచి పీఏ గా పని చేస్తున్న భిభవ్ కుమార్, ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పై తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు. చెంపపై ఏడు సార్లు బలంగా కొట్టడంతో పాటు, కడుపులో కాలితో తన్నారని ఆమె ఆరోపించారు. దాడి జరిగిన సమయంలో స్వాతి మాలివాల్ ఢిల్లీ పోలీసుల సాయం కోసం అత్యవసర నంబర్ కు కాల్ చేశారు. తరువాత ఎయిమ్స్ వైద్యుల నివేదిక ప్రకారం మాలివాల్ పై దాడి జరిగింది నిజమే అని తేలింది. అయితే వీటిని ఆప్ ఖండించింది. స్వాతి మాలీవాల్ పై ఎటువంటి దాడి జరగలేదని ప్రకటించింది.


Read More
Next Story