గెలుపుపై జైరాం రమేష్ ధీమా
x

గెలుపుపై జైరాం రమేష్ ధీమా

రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఓటర్లపై ప్రభావం చూపిందని, జూన్ 4న భారత కూటమి అధికారంలోకి రాబోతుందని పేర్కొన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేష్.


రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఓటర్లపై ప్రభావం చూపిందని, జూన్ 4న భారత కూటమి అధికారంలోకి రాబోతుందని పేర్కొన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేష్.ఇండియా కూటమి ఈ సారి కేంద్రంలో అధికారపగ్గాలు చేపట్టబోతుందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు రాజ్యాంగ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు పవన్‌ ఖేరా, సుప్రియా శ్రీనాతేతో కలిసి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రచారానికి జనం నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు. రాహుల్ గాంధీ నిర్వహించిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ఓటర్లపై ప్రభావాన్ని చూపగలిగిందన్నారు రమేష్.

జనవరి 23న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తొలిసారిగా యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్ గురించి మాట్లాడారని, ఒక్కో హామీని గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వేర్వేరు రోజుల్లో ఇచ్చారని గుర్తు చేశారు.

రాజ్యాంగ ప్రతిని వెంట తీసుకొని బహిరంగ సభలకు హాజరయిన రాహుల్ గాంధీ సామాజిక న్యాయాన్ని పరిరక్షిస్తామని, కుల గణనను పూర్తి చేస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని హామీ ఇచ్చారని జైరాం రమేష్ గుర్తు చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.

మోదీ వైఫల్యం..

కాంగ్రెస్ ప్రచారం ఓటర్ల కళ్లు తెరిపించిందన్నారు ఖేరా. తన పదేళ్ల పాలనలో మోదీ ఏం సాధించిందో దేశానికి చెప్పలేదన్నారు.

'72 రోజులు, 272 ప్రశ్నలు, 0 జవాబ్, భాగ్ మోదీ భాగ్' (రన్ మోడీ రన్) పేరుతో గత 72 రోజుల్లో మోదీని అడిగిన 272 ప్రశ్నల బుక్‌లెట్‌ను కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు.

Read More
Next Story