‘‘వారిని ఉరితీయడమే సరైనది’’
x

‘‘వారిని ఉరితీయడమే సరైనది’’

గత ఏడాది విదేశీ పర్యాటకురాలిపై అత్యాచారం, మరో విదేశీయుడిని హత్య చేసిన దుండగులు


Click the Play button to hear this message in audio format

గత సంవత్సరం హంపి సమీపంలో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ చేసి, ఒక ప్రయాణికుడి హత్య విషయంలో కోర్టు దోషులకు మరణదండన విధించింది. ఈ నేరాన్ని “అత్యంత అరుదైనది”గా కోర్టు పేర్కొంది.

కర్ణాటకలోని కొప్పల్ జిల్లా సెషన్స్ కోర్టు ఫిబ్రవరి 16న ఈ కేసులో ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చి మరణదండన విధించింది. వారు ఇద్దరు మహిళలపై (వారిలో ఒకరు ఇజ్రాయెల్‌కు చెందిన పర్యాటకురాలు) గ్యాంగ్ రేప్ కు గురవగా, ఒక పురుష పర్యాటకుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు.
నిందితులు మల్లేశ్ అలియాస్ హండిమల్ల, సాయి, శరణప్పగా గుర్తించబడ్డారు. గంగావతి జిల్లా సెషన్స్ కోర్టు వీరిని అత్యాచారం హత్య కేసుల్లో దోషులుగా నిర్ధారించింది. నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఇది “అత్యంత అరుదైన” కేసు కిందికి వస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
బాధితురాల్లో ఒకరు మాట్లాడుతూ, “న్యాయం జరిగింది. ఇది ప్రపంచాన్ని మరింత సురక్షితంగా మారుస్తుందని ఆశిస్తున్నాను” అని తెలిపారు.

ఆ రాత్రి ఏం జ‌రిగింది

ఈ ఘటన 2025 మార్చి 6 రాత్రి హంపి సమీపంలోని సనాపుర గ్రామంలో తుంగభద్ర ఎడమ కాలువ వద్ద జరిగింది. అభియోగాల ప్రకారం, నిందితులు ఇద్దరు మహిళలు (ఒక ఇజ్రాయెల్ పర్యాటకురాలు, ఒక హోమ్ స్టే నిర్వాహకురాలు) ముగ్గురు పురుష పర్యాటకులు ఉన్న బృందాన్ని టార్గెట్ గా చేసుకున్నారు.
పోలీసుల ప్రకారం, నిందితులు డబ్బు డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో హింసకు దిగారు. ముగ్గురు పురుషులను కాలువలోకి తోసి, ఇద్దరు మహిళలపై లైంగిక దాడి చేశారు. ముగ్గురిలో ఇద్దరు ఈదుతూ బయటపడ్డారు. అయితే ఒడిశాకు చెందిన ఒక పర్యాటకుడు కాలువలో మునిగి చ‌నిపోయాడు.

షాక్ అయిన ఘ‌ట‌న ఇది

ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. పర్యాటకుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పౌరసమాజ సంస్థలు రాజకీయ నాయకులు ఈ దాడిని ఖండించి, త్వరితగ‌తిన న్యాయం కోరారు. తాజా తీర్పుతో, నేరం తీవ్రత, లైంగిక దాడి , ప్రాణనష్టం కారణంగా మరణదండన సరైన శిక్ష అని కోర్టు స్పష్టం చేసింది.
Read More
Next Story