కుటుంబసభ్యులకు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం ..
x

కుటుంబసభ్యులకు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం ..

ఇప్పటివరకు 32 మృతదేహాలకు DNA పరీక్షలు పూర్తి; 14 కుటుంబాలకు అప్పగింత


గుజరాత్ రాష్ట్రం(Gujarat) అహ్మదాబాద్‌(Ahmadabad)లో జూన్ 12న జరిగిన ఘోర విమాన ప్రమాదం(Plane crash)లో 241 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఘటన స్థలం నుంచి వాటిని తొలుత సివిల్ ఆస్పత్రి మార్చురీకి తరలించి అక్కడ డీఎన్ఏ పరీక్షల ఆధారంగా కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు. ఇప్పటివరకు 32 మృతదేహాలకు DNA పరీక్షలు నిర్వహించి 14 కుటుంబాలకు వాటిని అప్పగించారు. ఇదే విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Vijay Rupani) మృతదేహాన్ని కూడా గుర్తించి ఆయన కుటుంబసభ్యులకు అందజేశారు.

మృతుల కుటుంబాలతో మాట్లాడేందుకు బృందాల ఏర్పాటు..

"మృతదేహాల డీఎన్ఏతో వారి కుటుంబసభ్యలు డీఎన్ఏతో పోలుస్తున్నాం. ఈ పరీక్ష ద్వారా 32 మృతదేహాలను గుర్తించాం. వీటిల్లో 14 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబాలకు అప్పగించాం. మృతులు ఉదయపూర్, వడోదర, ఖేడా, మెహ్సానా, అర్వల్లి, అహ్మదాబాద్ బోటాడ్ జిల్లాలకు చెందినవారు" అని సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ పటేల్ పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలతో మాట్లాడేందుకు 230 బృందాలను ఏర్పాటు చేశామని, మరణించిన 11 మంది విదేశీయుల బంధువులను కూడా సంప్రదించామని ఆయన చెప్పారు.

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన కొన్ని నిముషాలకు విమానం కూలిపోవడంతో పైలెట్లు, విమాన సిబ్బంది, ప్రయాణికులతో కలిసి మొత్తం 241 మంది చనిపోయారు. ఒక ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.

Read More
Next Story