
ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
బెంగాల్ నిజాన్ని బీజేపీ ఇప్పటికైనా అంగీకరించిందా?
పాలన కోసం పక్కా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్న కాషాయ దళం?
బెంగాల్ లో బీజేపీ తన ప్రణాళికలకు పదును పెడుతోంది. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఎలాగైన బెంగాల్ లో జెండా పాతాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అక్కడ గత 14 సంవత్సరాలుగా పాలనలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర యూనిట్ కు రెండు బాధ్యతలను అప్పగించింది.
కేంద్రంలో మోదీ ప్రభుత్వ 11 సంవత్సరాల పాలనను రాష్ట్రంలో మమతా బెనర్జీ 14 సంవత్సరాల పాలనను పోల్చి ప్రచారాన్ని ప్రారంభించాలని నాయకులను ఆదేశించింది. ఈ ప్రచారం విజయవంతం కావడానికి రాష్ట్ర యూనిట్ తన సంస్థాగత ఉనికిని, ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయాలని ఆదేశించింది.
ద్విముఖ వ్యూహాం..
రెండు వైపుల వ్యూహాన్ని వెల్లడిస్తూ, పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్ మాట్లాడుతూ.. ముర్షిదాబాద్ లో మత అల్లర్లకు దారి తీసిన మమతాబెనర్జీ బుజ్జగింపు విధానానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్ ద్వారా మోదీ ప్రభుత్వం విజయవంతమైన ఉగ్రవాద నిరోధక దాడులను ప్రచారం చేయాలని సంకల్పించింది.
ఈ వ్యూహం వెనక ఉన్న ప్రధాన చోదక శక్తి ఏమిటంటే, బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ దానిని ముందుకు తీసుకెళ్లడానికి సంస్థాగత పునాది లేదని దాని దృఢమైన నమ్మకం అని ఆఫీస్ బేరర్ ఒకరు తెలిపారు.
మోదీ- షా ద్వయం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఆపరేషన్ సిందూర్, ముర్షిదాబాద్ లో జరిగిన మత అల్లర్లను ప్రస్తావించారు.
ఆ విధంగా ఎన్నికల కథనాన్ని సిద్దం చేసే పనిని ప్రారంభించింది. మే 29న అలీపుర్థువార్ లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. జూన్ 1న కోల్ కతలో జరిగిన ‘‘కార్యకట సమ్మేళన్’’ లో అమిత్ షా ప్రసంగించారు.
ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ లతో కూడా అమిత్ షా కూడా రహస్య సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా ఇతర సీనియర్ రాష్ట్ర నాయకులతో మరోసారి సమావేశమయ్యారు.
తాజా నివేదిక..
రాష్ట్ర యూనిట్ సమర్పించిన సంస్థాగత నివేదికను తిరస్కరించిన షా, బూత్ లను సందర్శించడం ద్వారా వాస్తవికతను తనిఖీ చేయాలని పిలుపునిచ్చారు.
‘‘జూలై 5 నాటికి వాస్తవ సంస్థాగత బలం గురించి నివేదిక సమర్పించాలని పార్టీ కేంద్ర పరిశీలకులను కోరారు’’ అని బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్టీ బూత్ స్థాయి బలాన్ని అంచనా వేయడానికి కేంద్ర పరిశీలకులు ప్రతి జిల్లాను సందర్శించాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని దాదాపు 80 వేల బూత్ లలో 40 శాతం బూత్ లలో పార్టీకి బలమైన సంస్థాగత స్థానం లేదని బీజేపీ అంతర్గత నివేదిక సూచించింది. దాదాపు 14 వేల బూత్ లలో పార్టీకి దాదాపుగా సంస్థాగత ఉనికి లేదు.
ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల వెలుపల బూత్ లను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర యూనిట్ లను కోరింది.
డ్రైవ్ ను బలోపేతం కోసం ప్యానెల్..
బూత్ సశక్తికరణ్(బూత్ లను బలోపేతం చేసే పేరు) డ్రైవ్ ను పర్యవేక్షించడానికి 2017 లో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీజేపీలో చేరిన ప్రబల్ రహా నేతృత్వంలోని గురువారం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
ఆయనకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడంపై పాతతరం నాయకులు ఒక సందేశంగా భావిస్తున్నారు. అయినప్పటికీ అసంతృప్తి చెందిన సీనియర్లు తమ అభిప్రాయాన్ని పంచుకోకపోతే, పార్టీ వారిని మించి చూస్తుందని సందేశం స్ఫష్టంగా ఉంది.
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మోదీ- షా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు ఏ కార్యక్రమాలకు హాజరు కావడానికి ఆహ్వానం కూడా అందడం లేదు. చాలామంది పాతతరం నాయకులు పార్టీపై అలకబూనారు.
జాతీయవాదం, హిందూత్వం..
జాతీయవాదాన్నిహిందూత్వాన్ని విస్తృత ప్రచారాల ద్వారా ప్రజలకు సమర్థవంతంగా తెలియజేయగలిగితే జాతీయవాదం, హిందూత్వ శక్తివంతమైన కలయికగా సరైన విజయ కథనం కాగలదని పార్టీ కేంద్ర నాయకులు అభిప్రాయపడ్డారు.
మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 9 నుంచి ఈ ప్రచారం ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా నెలరోజుల పాటు జరిగే ఈ ప్రచారాన్ని మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ దుష్పరిపాలనను ఏకకాలంలో హైలైట్ చేయడం ద్వారా రాష్ట్రంలో మరింతగా పట్టుబిగించాలని బీజేపీ భావిస్తోంది.
పోల్స్ పై దృష్టి..
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నిర్దేశించిన ఒక నెల కంటే ఎక్కువ కాలం భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది. హోర్డింగ్ లు, బ్యానర్లు, సోషల్ మీడియా పోస్టులను ఏర్పాటు చేయడమే కాకుండా పార్టీ ప్రచారంలో ఇంటింటికి సందర్శనలు, రోడ్డు పక్కన సమావేశాలు, కరపత్రాల పంపిణీ కూడా ఉంటాయి.
బీజేపీ ప్రణాళికలు సిద్దంగా ఉన్నాయి. వీటి తరువాత పార్టీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి. ముఖ్యంగా పాత, కొత్త గ్రూపులుగా పార్టీ చీలిపోయిన సందర్భంలో.
Next Story