యూపీలో కాంగ్రెస్ వంద రోజుల సంగతన్ సృజన్
x
అవినాశ్ పాండే

యూపీలో కాంగ్రెస్ వంద రోజుల "సంగతన్ సృజన్"

పార్టీ పునర్ణిర్మాణం, బీజేపీని ధీటుగా ఎదుర్కోవడమే లక్ష్యమంటున్న రాష్ట్ర ఇన్‌చార్జి అవినాష్ పాండే..


ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో 2027లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్నాయి. అంతకంటే ఏడాది ముందు 2026లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్(Congress) పార్టీ సమాయత్తమవుతోంది. పార్టీ పునర్ణిర్మాణంపై దృష్టి పెడుతూనే..ప్రధాన ప్రత్యర్థి బీజేపీ(BJP)కి గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. ఈ క్రమంలోనే "సంగతన్ సృజన్" (సంస్థ నిర్మాణం)‌కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమ వివరాలను ఏడు రోజుల పాటులో రాష్ట్రంలో ఉండబోతున్న ఉత్తరప్రదేశ్ పార్టీ ఇన్‌చార్జి అవినాష్ పాండే(Avinash Pande) వార్తా సంస్థ పీటీఐతో షేర్ చేసుకున్నారు.

100 రోజుల పాటు 75 జిల్లాల్లో..

‘‘యూపీలోని మొత్తం 75 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. కేడర్‌లో నూతనోత్తేజాన్ని నింపేందుకు 100 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహిస్తాం.’’ అని చెప్పారు పాండే.

2022 రాష్ట్ర ఎన్నికల్లో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. ఎస్పీ తన సీట్ల సంఖ్యను 47 నుంచి111 సీట్లకు మెరుగుపరుచుకోగా, కాంగ్రెస్ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది.

ఎస్పీ, బీఎస్పీ లాంటి ప్రాంతీయ పార్టీలు, ఆధిపత్య బీజేపీ గురించి పాండే మాట్లాడుతూ.. "దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టి సుపరిపాలన అందించిన విషయం మీకు తెలుసు. ఆ తర్వాతే ప్రాంతీయ ప్రాంతాలు అధికారంలోకి వచ్చాయి. ప్రస్తుతం పార్టీ పునర్‌వైభవంపై దృష్టి సారించాం.’’ అని చెప్పారు.

సుపరిపాలన కోసమే..

"బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పునర్ణిర్మాణం చేపడతాం. పార్టీ కార్యకర్తలల్లో నూతనోత్తేజాన్ని నింపుతాం. 2026 పంచాయతీ ఎన్నికలు, 2027 అసెంబ్లీ ఎన్నికలు, 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వస్తాయని విశ్వసిస్తున్నాను. ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడం, వారి అంచనాలకు అనుగుణంగా పాలన సాగించడమే మా లక్ష్యం" అని పాండే చెప్పారు.

బీజేపీ ప్రభుత్వంపై కూడా పాండే విమర్శలు గుప్పించారు. సీఎం అదిత్యనాథ్ యోగి పాలన నిరంకుశత్వాన్ని తలపిస్తోందన్నారు. "ప్రభుత్వం పక్షపాతపూరితంగా వ్యవహరిస్తోంది. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. ప్రతిపక్షాలకు తగిన గౌరవం ఇవ్వడం లేదు." అని పాండే అన్నారు.

ఇకపోతే.. 2024 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీ కూటమి మంచి పనితీరు కనబరిచింది. కాంగ్రెస్ పోటీ చేసిన 17 సీట్లలో ఆరు సీట్లు గెలుచుకుంది. ఎస్పీ 37 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ నంబర్ 62 నుంచి 33కి పడిపోయింది.

Read More
Next Story