స్టాక్ మార్కెట్: ప్రారంభ కొనుగోళ్లలో దూకుడు
x

స్టాక్ మార్కెట్: ప్రారంభ కొనుగోళ్లలో దూకుడు

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం ఉండటంతో భారత స్టాక్ మార్కెట్లు ప్రారంభ ట్రేడింగ్ లో దూకుడు ప్రదర్శించాయి.


గ్లోబల్ మార్కెట్లలో అనుకూల వాతావరణం, ఐటి స్టాక్‌లలో కొనుగోళ్లు, విదేశీ నిధుల ప్రవాహాల కారణంగా మంగళవారం ప్రారంభ ట్రేడ్‌లో భారత్ స్టాక్ మార్కెట్లు నిఫ్టి, బీఎస్ఈ సెన్సెక్స్ కొత్త గరిష్టాలకు చేరుకున్నాయి.

నాలుగు వరుస సెషన్‌లో 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ 334.03 పాయింట్లు ఎగబాకి 77,326.80 వద్ద జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 108.25 పాయింట్లు పెరిగి సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 23,573.85 వద్దకు చేరుకుంది.

సెన్సెక్స్ కంపెనీల్లో విప్రో, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. మారుతీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకులు కాస్త వెనకబడ్డాయి.
ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో, షాంఘై పాజిటివ్ గా ట్రేడ్ అవుతుండగా, హాంకాంగ్ మాత్రం కాస్త తక్కువ స్థాయి లాభాలను నమోదు చేసింది. సోమవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) శుక్రవారం రూ. 2,175.86 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజ్ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.15 శాతం క్షీణించి 84.12 డాలర్లకు చేరుకుంది. ఈద్-ఉల్-అదా సందర్భంగా సోమవారం ఈక్విటీ మార్కెట్లు మూతపడ్డాయి.
మూడవ వరుస సెషన్‌లో, బిఎస్‌ఇ బెంచ్‌మార్క్ 181.87 పాయింట్లు లేదా 0.24 శాతం ఎగబాకి శుక్రవారం కొత్త ముగింపు గరిష్ట స్థాయి 76,992.77 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 66.70 పాయింట్లు లేదా 0.29 శాతం పుంజుకుని 23,465.60 వద్ద రికార్డు వద్ద ముగించింది.
Read More
Next Story