
మణిపూర్లో రాజకీయ సంక్షోభం: గవర్నర్తో బీజేపీ నేత సంబిత్ పాత్ర భేటీ
మణిపూర్లో ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఫిబ్రవరి 9న రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో అధికార పార్టీ బీజేపీ నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
మణిపూర్(Manipur)లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బీజేపీ(BJP) సీనియర్ నేత సంబిత్ పాత్ర(Sambit Patra) బుధవారం (ఫిబ్రవరి 12) ఉదయం ఇంపాల్(Imphal)లోని రాజ్ భవన్లో గవర్నర్ అజయ్ కుమార్ (Ajay Kumar) భల్లాను కలిసినట్టు సమాచారం. వారిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల బీజేపీ ఇన్చార్జ్గా ఉన్న సంబిత్ పాత్ర హోటల్కు వెళ్లారు. అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలను కలిసే అవకాశం ఉంది. మంగళవారం (ఫిబ్రవరి 11) కూడా సంబిత్ పాత్ర నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ను కలిసింది.
ఆరుగురు మిలిటెంట్ల అరెస్టు..
మణిపూర్లోని ఇంపాల్ వెస్ట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి, విప్లవ దళ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న ముగ్గురు మిలిటెంట్లను అరెస్టు చేశారు. నిషేధిత పీపుల్స్ రెవల్యూషనరీ ఫ్రంట్ ఆఫ్ కంగ్లైపాక్ (PREPAK PRO) ఉగ్ర సంస్థకు చెందిన ఇద్దరిని మంగళవారం నాందులాంగ్ ఖుమన్ లంపక్ మెయిన్ స్టేడియం రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. వీరిని 41 ఏళ్ల అషెమ్ దినేష్ మీతేరు, 36 ఏళ్ల హుయిద్రోమ్ తోంబా సింగ్గా గుర్తించారు. వీరు నాందులాంగ్ ప్రాంతంలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. వీరి నుంచి ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
లాంగోల్ గేమ్ విలేజ్ జోన్ 2లో మంగళవారం నిషేధిత కంగ్లైపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (PWG)కు చెందిన మరో మిలిటెంటును అరెస్టు చేశారు. 22 ఏళ్ల థోంగ్రామ్ బిద్యాశాగర్ సింగ్ (22)గా గుర్తించారు. అతడి నుంచి మూడు హ్యాండ్హెల్డ్ రేడియో సెట్లు, నలుగు చార్జర్లు, వివిధ రకాల మిలిటరీ దుస్తులు, బ్యాగులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. లాంగోల్ గేమ్ విలేజ్ జోన్ 1లోని మరో ప్రాంతంలో పోలీసులు రెండు ప్లాస్టిక్ టియర్ గ్యాస్ స్మోక్ బాక్సులు, 58 ఖాళీ షెల్లులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
2023 మే నుంచి ఇంపాల్ వ్యాలీకి చెందిన మీతేలు, పరిసర కొండ ప్రాంతాలకు చెందిన కుకి-జో సమూహాల మధ్య జరిగిన హింస కాండలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.