
త్వరలో మీ నాన్నలా తయారవుతావు..లోకేష్కి మోదీ కాంప్లిమెంట్
మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లతో కలిసి స్వాగతం పలికిన నారా లోకేష్.
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా సన్నబడ్డావు అంటూ కితాబిచ్చారు. గతంలో చూసినప్పటి కంటే ఈ సారి చాలా సన్నబడ్డావు.. చాలా బరువు తగ్గావు.. అని అంటూ త్వరలోనే మీ నాన్న చంద్రబాబులా తయారవుతావు అంటూ కితాబిచ్చారు. దీనికి మంత్రి నారా లోకేష్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. థాంక్యూ సార్ అంటూ మోదీకి లోకేష్ బదులిచ్చారు. పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు ప్రధాని మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కలిసి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ను చూసిన ప్రధాని మోదీ సరదాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనల్లో మంత్రి నారా లోకేష్ దగ్గర ఉండి ఏర్పాట్లన్నీ చూసుకున్నారు. తన పర్యవేక్షణలోనే మోదీ పర్యటన ఏర్పాట్లు చేపట్టారు. ఈ సారి మోదీ పర్యటన ఏర్పాట్లు కూడా లోకేష్ నేతృత్వంలోనే జరిగాయి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారు. ఈ నేపధ్యంలో లోకేష్కు మోదీ ఓ బంపర్ ఆఫర్ను కూడా ఇచ్చారు. ఎప్పుడైనా ఢిల్లీ వచ్చినప్పుడు తనను కలవాలని లోకేష్కు మోదీ సూచించారు. కుటుంబంతో కలిసి రావాలని లోకేష్ను ఆహ్వానించారు.
ఆ మేరకు తన భార్య నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాంష్లతో కలిసి ఢిల్లీ వెళ్లి అక్కడ ప్రధాని మోదీని కలిశారు. దాదాపు రెండు గంటల పాటు మోదీ లోకేష్ కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు. లోకేష్ కుమారుడు దేవాంష్ను ప్రధాని మోదీ ముద్దులాడారు. వారితో కలిసి డిన్నర్ కూడా చేశారు. ఈ సందర్భంగా లోకేష్ తన యువగళం పాదయాత్ర పుస్తకాన్ని కూడా మోదీ తన చేతుల మీదుగా ఆవిష్కించి అభినందించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సారి పర్యటనలో కూడా మంత్రి నారా లోకేష్ను ప్రత్యేకంగా పలకరించి మాట్లాడటం సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా నిలిచింది.
Next Story