యోగా ప్రశాంతతను పెంపొందిస్తుంది
x

యోగా ప్రశాంతతను పెంపొందిస్తుంది

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకంక్షలు తెలిపారు.


యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జూన్‌ 21 శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా జీవితంలో ప్రశాంతతను పెంపెందించడానికి ఎంతగానో సహాయపడుతుందని జగన్‌ పేర్కొన్నారు. ఆ మేరకు ఆయన శనివారం సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

మానవ శరీరం, ఆత్మ రెండింటిపైన యోగా ప్రభావం ఉంటుంది. మానవుని నిత్య జీవితంలో తనను తాను మానసికంగా, శారీరకంగా బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రశాంతతను పెంపొందించుకోవడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్న యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం అంటూ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

Read More
Next Story