యోగా ఎఫెక్ట్‌.. డిఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పులు
x

యోగా ఎఫెక్ట్‌.. డిఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పులు

జూన్‌ 6 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మెగా డిఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న మెగా డీఎస్సీ పరీక్షలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్‌ 21కి ముందు జూన్ 20 న, తర్వాత జూన్ 21న జరగాల్సిన డీఎస్సీ పరీక్షలను మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు తేదీలను మార్పు చేసింది. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున నిర్వహించేందుకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. ఐదు లక్షల మందితో విశాఖ సముద్ర తీరం ఆర్కే బీచ్‌లో యోగా కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.

ఈ నేపథ్యంలో జూన్‌ 20న, జూన్‌ 21న జరగాల్సిన మెగా డీఎస్సీ పరీక్షలను జూలై 1, 2 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మెగా డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాలు, పరీక్షల తేదీలతో పాటు మార్చిన హాల్‌ టికెట్లను https://apdsc.apcfss.inలో జూన్‌ 25 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు ఎంవీ కృష్ణారెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజుల్లో మెగా డీఎస్సీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు ఈ మార్పులను గమనించాలని సూచించారు. జూన్‌ 25 నుంచి అందుబాటులో ఉంచనున్న హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొని, నిర్థేశించిన తేదీల ప్రకారం పరీక్షలకు హాజరు కావాలని ఎంవీ కృష్ణారెడ్డి డీఎస్సీ అభ్యర్థులకు సూచించారు. జూన్‌ 6 నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి.
Read More
Next Story