
వైసీపీ వాళ్లు ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారు
సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశే అవుతుందని జగన్ మీద లోకేష్ మండిపడ్డారు.
పొదిలిలో రాళ్ల దాడికి పాల్పడ్డా వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి నారా లోకేష హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పొదిలిలో పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. జగన్ రాకను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనలు తెలిపారు. పొదిలిలో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించేందుకు జగన్ వస్తున్న నేపథ్యంలో మహిళలను కించపరిచిన జగన్ క్షమాపణలు చెప్పాలి, భారతిరెడ్డి మౌనం వీడాలి అంటూ మహిళలు ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలిపారు. క్షమాపణలు చెప్పిన తర్వాతనే జగన్ అడుగు పెట్టాలని ఆందోళనలు తెలిపారు. నల్లబెలూన్లు చేతబట్టి జగన్మోహన్రెడ్డి రాకను నిరసించారు.
ఈ నేపథ్యంలో జనం గుంపులో నుంచి కొంత మంది కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్న మహిళలపై రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో కొంత మంది మహిళలతో పాటు పోలీసు కానిస్టేబుళ్లకు గాయలయ్యాయి. దీనిపైన మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీషీర్లకు ఓదార్పు యాత్ర చేశారు.. ఇప్పుడేమో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారికి మద్ధతిస్తున్నారు.. అంటూ మండిపడ్డారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
#YCPinsultsWomen#YCPattacksWomen #PsychoFekuJagan
— Lokesh Nara (@naralokesh) June 11, 2025
పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసుల పై వైకాపా సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలు, పోలీసుల పై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాం. జగన్ రెడ్డి గారు మొన్న తెనాలి గంజాయి బ్యాచ్… pic.twitter.com/yYCcBnvXsN