వైసీపీ కార్యకర్తను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు
x

వైసీపీ కార్యకర్తను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు

కమ్మ సామాజికి వర్గానికి చెందిన వాడివైనా ఎందుకు నువ్వు వైసీపీలో ఉన్నావని బాధితుడిని డీఎస్పీ అవమానించినట్లు జగన్‌ పేర్కొన్నారు.


వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని రాజుపాలెం మండలం, పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ అనే వైసీపీ కార్యకర్త తనను టీడీపీ నేతలు, పోలీసులు వేధించి, హింసించారని తీవ్ర మనోవేధనకు గురై శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. దీనిపైన వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అర్థరాత్రి సోషల్‌ మీడియా వేదికగా ఆయన సీఎం చంద్రబాబు పాలనపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ ఏమన్నారంటే..
రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించారు. తనపై గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సీఐ, ఎస్సై విచారించినప్పటికీ, లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచిపెట్టారు. కాని, అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తర్వాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని తీవ్ర వేధింపులకు దిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైయస్సార్‌సీపీలో ఎందుకున్నావు అని డీఎస్పీ తీవ్రంగా అవమానపరిచి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని, డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు.
దీంతో లక్ష్మీనారాయణ ఈ తెల్లవారు జామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ డీఎస్పీ దుర్మార్గంపై వీడియో వాంగ్మూలం ఇచ్చాడు. బాధ్యులైన వ్యక్తుల పేర్లతో లేఖ కూడా రాశాడు. ఇప్పుడు చావుబతుకుల మధ్య గుంటూరు ఆస్పత్రిలో ఉన్నాడు. లక్ష్మీనారాయణ కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనారాయణకు, ఆయన కుటుంబానికి వైయస్సార్‌సీపీ అండగా ఉంటుంది. ఈ ఘటనకు బాధ్యులైన డీఎస్పీ సహా మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను. అంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Read More
Next Story