
రియల్ టైమ్ గవర్నెన్స్లో మహిళా ఐఏఎస్, ఐపీఎస్ లు
టెక్తో టచ్ అయ్యే పాలసీలకు కొత్త దిశ ను ప్రభుత్వం చూపించింది. యంగ్ లేడీస్ అయిన ఇద్దరు ఐఏఎస్ లు, ఒక ఐపీఎస్ ను ఆర్టీజీలో పోస్టు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) శాఖలో ఇద్దరు ఐఏఎస్ లు, ఒక ఐపీఎస్ అధికారులను నియమించడంతో డిజిటల్ గవర్నెన్స్కు కొత్త ఊపు రావడం ఖాయం. అక్టోబర్ 6, 7 తేదీల్లో జారీ అయిన ఉత్తర్వుల్లో గీతాంజలి శర్మ, పి. ధాత్రి రెడ్డి (ఐఏఎస్, 2020 బ్యాచ్), మలికా గార్గ్ (ఐపీఎస్, 2015 బ్యాచ్)లకు ఎక్స్-ఆఫీషియో డిప్యూటీ/జాయింట్ సెక్రటరీలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐటీఈఅండ్సీ శాఖలో కూడా కమ్యూనికేషన్స్, టెక్నికల్ డైరెక్టర్లుగా వీరి పాత్ర ఉంటుంది. ఈ నియామకాలు వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? టెక్నాలజీతో ముడిపడిన రియల్టైమ్ పాలసీలను బలోపేతం చేయడమేనా? లేక మహిళా అధికారులకు ముందస్తు ప్రాధాన్యతా? అనేది ఆంధ్రప్రదేశ్ లో చర్చనియాంశమైంది.
రియల్ టైమ్ గవర్నెన్స్.. ఏమిటీ శాఖ?
ఆంధ్రప్రదేశ్లో 2014లో ఏర్పాటు చేసిన ఆర్టీజీ సొసైటీ అనేది సాధారణ శాఖ కాదు. ఇది డిజిటల్ టెక్నాలజీతో పౌరుల ఫిర్యాదులను రియల్టైమ్లో పరిష్కరించే, ప్రభుత్వ సేవలను వేగవంతం చేసే మెషినరీ. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లా సెంటర్లు, ఒక రాష్ట్ర సెంటర్తో పనిచేస్తుంది. హిటాచీ వంటి కంపెనీల సహకారంతో ఏఐ, డేటా అనలిటిక్స్, వీడియో మానిటరింగ్ ఉపయోగించి ప్రభుత్వం త్వరగా నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీప్టెక్ స్టేట్ విజన్లో ఇది కీలకం. గ్రీవెన్స్ రెడ్రసల్ నుంచి స్మార్ట్ సిటీల వరకు అన్నీ రియల్టైమ్ డేటాతో రన్ అవుతాయి. ఇప్పుడు వీటిని బలోపేతం చేయడానికి టెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న యువ అధికారులు అవసరమయ్యారు.
ముగ్గురు మహిళా అధికారులు.. వారి ట్రాక్ రికార్డ్
ఈ నియామకాల్లో ముగ్గురూ మహిళలు కావడం విశేషం. వీరి బ్యాక్గ్రౌండ్ చూస్తే, ప్రభుత్వ ఎంపిక వెనుక లాజిక్ స్పష్టమవుతుంది.
గీతాంజలి శర్మ (ఐఏఎస్, 2020)
ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల యువతి. జువాలజీలో బీఎస్సీ చేసి, హిందూ కాలేజీ నుంచి ఎంబీఏ. ఏపీ ఫైబర్నెట్ ఎండీగా ఇప్పటికే డిజిటల్ కనెక్టివిటీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన ఆమె, కమ్యూనికేషన్స్ డైరెక్టర్గా ఇకపై ఆర్టీజీలో పౌరులతో డిజిటల్ బంధాన్ని మరింత బలపరుస్తారు.
పి. ధాత్రి రెడ్డి (ఐఏఎస్, 2020)
తెలంగాణకు చెందిన 32 ఏళ్ల ఇంజనీర్. ఐఐటీ ఖరగ్పూర్ నుంచి బీటెక్. డాయిచె బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పని చేసిన ఆమె, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ. పాడేరు సబ్ కలెక్టర్గా మొదటి పోస్టింగ్లోనే ట్రైబల్ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ప్రాజెక్టులు సక్సెస్ చేశారు. టెక్నికల్ డైరెక్టర్గా ఆర్టీజీలో ఇన్నోవేషన్కు దోహదపడతారు.
మలికా గార్గ్ (ఐపీఎస్, 2015)
వెస్ట్ బెంగాల్ నుంచి ఏపీకి ట్రాన్స్ఫర్ అయిన 35 ఏళ్ల అధికారి. ప్రకాశం, తిరుపతి, పల్నాడు జిల్లాలకు ఎస్పీ గా పనిచేసిన మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. సిఐడీలో పనిచేసిన ఆమె టెక్నికల్ సర్వీసెస్ ఎస్పీగా ఇప్పుడు ఐటీఈఅండ్సీ, ఆర్టీజీ జాయింట్ సెక్రటరీగా పోలీస్-టెక్ ఇంటిగ్రేషన్కు నియమితులయ్యారు.
వీరు ముగ్గురూ యువతులు. టెక్ ఎఫిషియెంట్లు. ఇది ప్రభుత్వం విజన్కు మ్యాచ్ అవుతుంది.
వీరి నియామకం వెనుక ఉన్న ఉద్దేశ్యం
ఈ నియామకాలు కేవలం అదనపు ఛార్జీలు కాదు. రాష్ట్ర డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు స్ట్రాటజిక్ మూవ్. చంద్రబాబు నాయుడు 'డీప్టెక్ స్టేట్' గోల్లో ఆర్టీజీని సెంటర్గా చేశారు. ఫైబర్నెట్, ఇన్నోవేషన్ హబ్, పోలీస్ టెక్ సర్వీసెస్తో ముడిపడి, రియల్టైమ్ డేటా ద్వారా క్రైమ్ ప్రెవెన్షన్ నుంచి సర్వీస్ డెలివరీ వరకు అన్నీ ఆటోమేట్ అవుతాయి. ధాత్రి రెడ్డి ఐఐటీ బ్యాక్గ్రౌండ్, గీతాంజలి కమ్యూనికేషన్ స్కిల్స్, మల్లికా పోలీస్ ఎక్స్పీరియన్స్. ఇది పర్ఫెక్ట్ కాంబో.
మహిళా ఎంపవర్మెంట్
ఏపీలో మహిళా అధికారులు ఎక్కువగా ఉన్నా, కీలక టెక్ రోల్స్లో ఇది మైలురాయి. మల్లికా మొదటి మహిళా ఎస్పీ గా చరిత్ర సృష్టించారు. యువ మహిళలకు ఇది ఇన్స్పిరేషన్. ప్రభుత్వం 'వుమెన్ లీడ్' పాలసీతో డైవర్సిటీని ప్రమోట్ చేస్తోంది.
టైమింగ్
అక్టోబర్లో జారీ అయిన ఈ ఆర్డర్లు, రాష్ట్ర బడ్జెట్ సెషన్ ముందు డిజిటల్ ఇన్ఫ్రా ప్రాజెక్టులు (ఫైబర్నెట్, స్మార్ట్ పోలీసింగ్) వేగవంతం చేయడానికి ఇది సిగ్నల్. కానీ ఛాలెంజ్లు ఉన్నాయి. డేటా సెక్యూరిటీ, రూరల్ కనెక్టివిటీ. వీరు ఈ గ్యాప్లను బ్రిడ్జ్ చేయాలి.
భవిష్యత్ ఆశలు
ఈ ముగ్గరు మహిళా అధికారుల నియామకం ఏపీ గవర్నెన్స్ను మరింత స్మార్ట్గా మారుస్తుంది. టెక్ + లీడర్షిప్ + డైవర్సిటీ కాంబినేషన్తో పౌరులకు వేగవంతమైన సేవలు రానున్నాయి. ఇది కేవలం ఆర్డర్ కాదు, రాష్ట్ర విజన్కు కొత్త అధ్యాయం.