
జగన్ అంటే కూటమికి ఎందుకు భయం..వణుకు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకి మాజీ సీఎం జగన్ రావడం ఖామని వైసీపీ నేతలు వెల్లడించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే.. కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు ఎందుకు అంత భయం.. వణుకు అని వైసీపీ నేతలు మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జగన్ పర్యటనకు సంధించిన అనుమతుల కోసం ఎస్పీని కలిసిన అనంతరం నరసరావుపేటలో వారు మాట్లాడుతూ బుధవారం పల్నాడు జిల్లాకు రావడం ఖాయం అంటూ కుండబద్దలు కొట్టారు.
జగన్ పర్యటనకు ఎస్పీని అనుమతులు కోరామని, 50 మందికి, 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తామని ఎస్పీ చెబుతున్నారని, స్థానిక నాయకుడు పరామర్శకు వెళ్తుంటేనే వందలాది మంది కార్యకర్తలు వెంట వెళ్తారని అలాంటిది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శకు వస్తుంటే కారకర్తలు రాకుండా ఎలా ఉంటారని, వారిని ఎలా నియంత్రిస్తామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ప్రశ్నించారు. నియోజక వర్గం నుంచి కార్యకర్తలను తీసుకెళ్తామని తాము ఆలోచిస్తుంటే.. కార్యకర్తలు రావద్దని, వాహనాలు రావద్దని ఎస్పీ చెబుతున్నారని, ఎస్పీ చెబుతున్న ప్రకారమే తాము వాహనాలు ఆపేస్తామని, తమకు కావలసింది టీడీపీ శ్రేణుల హింసలను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించమే అని స్పష్టం చేశారు.
జగన్మోహన్రెడ్డి పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నారని విషయం యావత్తు దేశానికి తెలుసని, ఆ విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని, దాని కోసం పనిగట్టుకొని జనసమీకరణ చేయాల్సిన అవసరం లేదన్నారు. తాము కూడా జగన్ వెనుకాలే వెళ్లి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి వస్తామని, దానికి పర్మిషన్ ఇవ్వాలని ఎస్పీని కోరామని, దీనిపై ఆలోచిస్తామని ఎస్పీ చెప్పినట్లు వెల్లడించారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నుండి రెంటపాళ్ల వచ్చి నాగమల్లేశ్వరావు కుటుంబాన్ని పరామర్శిస్తారని, ఆ మేరకు తాడేపల్లి కార్యాలయం నుంచి తమకు సంకేతాలు అందినట్లు కాసు మహేష్రెడ్డి వెల్లడించారు. ఏదిఏమైనా బుధవారం జగన్ పర్యటన ఆగదని స్పష్టం చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు రాష్ట్రంలో చేసిన పర్యటనలు వైసీపీ ప్రభుత్వం ఏ నాటు అడ్డుకోలేదన్నారు. ఒక్కడైనా వచ్చి పరామర్శించి తీరుతారని వెల్లడించారు.
రెడ్ బుక్ పాలనకు, పోలీసుల వేధింపులకు తట్టుకోలేక 38 ఏళ్ల నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు పోగొట్టుకున్నాడని మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ వస్తుంటే ఆపేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. అనుమతుల పేరుతో, సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ సమస్యల పేరుతో జగన్ పర్యటనలను పద్దతి ప్రకారం అడ్డుకుంటోందని మండిపడ్డారు. జగన్ అంటేనే జనమని, అలాంటిది జగన్ పర్యటనకు జనాలను తలరించాల్సిన అవసరం లేదన్నారు. జగన్ రెంటపాళ్లకు రాకుండా కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేíసినా జగన్ వచ్చి తీరుతారని, నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని కలసి ఓదార్చి, విగ్రహాన్ని ఆవిష్కరించి వెళ్తారని విడదల రజని స్పష్టం చేశారు.
Next Story