అచ్చెన్న పర్సనాలిటీపై సీఎం ఏమన్నారంటే
x

అచ్చెన్న పర్సనాలిటీపై సీఎం ఏమన్నారంటే

యావత్తు యోగాంధ్ర కార్యక్రమంలో వ్యక్తిగ బహుమతి తనకే రావాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.


మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన పర్సనాలిటీ మీద సీఎం చంద్రబాబు ఏమన్నారో వెల్లడించారు. వైజాగ్‌లో శనివారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తన పర్సనాలిటీ చూసి, తన బరువును చూసి ఒక వేళ యోగాను చేయలేక పోతే యోగాంధ్రకు రావద్దని సీఎం చంద్రబాబు అన్నారని, దీనిని ప్రిస్టేజిగా తీసుకొని యోగా చేశానిని, తనకు యోగా మీద ఎలాంటి ప్రాక్టీస్‌ లేక పోయినా.. ఒక దృఢమైన విశ్వాసంతో ఈ రోజు యోగాంధ్రలో పాల్గొని, అందరు ఏమాదిరిగా యోగా చేస్తున్నారో, వారిలాగే తాను కూడా యోగాను చేశాను అంటూ యోగ మీద తన పట్టుదల గురించి మంత్రి అచ్చెన్నాయుడు చెప్పొకొచ్చారు.

అంతేకాదు తాను ఎంతో దృఢ విశ్వాసంతో యోగా చేశానని, యోగాకు చేసేందు తాను కష్టపడిన విధానానికి యోగాంధ్ర ఈవెంట్‌లో వ్యక్తిగతంగా బహుమతులు ఏమైనా ఇస్తే యావత్‌ యోగాంధ్రలో తనకే ఫస్ట్‌ ప్రైజ్‌ ఇవ్వాలని.. ఎంతో క్రమశిక్షణతో యోగా చేశానని, ఒక్క పిన్‌ పాయింట్‌ కూడా తప్పకుండా.. నీట్‌గా.. అందరి మాదిరిగానే తాను కూడా యోగాసనాలు వేశానని,. యోగా తనకు చాలా ఆనందాన్నిచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు తన యోగా మంత్రాన్ని చెప్పొకొచ్చారు.

యోగాంధ్రకు ఐదు లక్షల మంది వస్తారా? అని తొలుత భయమేసింది. తర్వాత పోయిన నెల మే 21 నుంచి జూన్‌ 21 వరకు నెల రోజుల పాటు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు నెల రోజుల పాటు ప్రజలో చైతన్య పరచడం వల్ల ప్రభుత్వం కన్న కల నెరవేరిందన్నారు. స్వచ్ఛందంగా ప్రజుల తరలి వచ్చారని, ఇంత భారీగా తరలి రావడం తన జీవితంలో చూడలేదన్నారు.
Read More
Next Story