
రామోజీపై చంద్రబాబు,లోకేష్ ఏమన్నారంటే
వ్యాపారాల్లో కూడా ప్రజా హితం చూపించారని చంద్రబాబు అంటే, తుది శ్వాస వరకు ప్రజా శ్రేయస్సుకోసమే పని చేశారని లోకేష్ అన్నారు.
రామోజీరావు ప్రథమ వర్థంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్షరయోధుడని, విలువలతో కూడిన జర్నలిజంతో, నిష్పక్షపాత పాత్రికేయంతో రామోజీ ముద్ర వేశారంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తలవంచని నైజంతో వ్యాపారాల్లో కూడా రామోజీ ప్రజాహితం చూపించారని కొనియాడారు. ఆ మేరకు ఆదివారం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు.
తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, పద్మవిభూషణ్ రామోజీరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ అక్షర యోధునికి నివాళులు అర్పిస్తున్నాను. నేడు ఆయన మన మధ్య లేకపోయినా... విలువలతో కూడిన పాత్రికేయంతో, నిష్పక్షపాత జర్నలిజంతో సమాజంపై రామోజీరావు వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదు. రామోజీరావు గారు… pic.twitter.com/VsUPzzkTpW
— N Chandrababu Naidu (@ncbn) June 7, 2025
పద్మవిభూషణ్, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళి అర్పిస్తున్నాను. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అడుగుపెట్టిన ప్రతిరంగంలోనూ ఆయన చెరగని ముద్రవేశారు. ‘ఈనాడు’ ద్వారా పత్రికా రంగంలో నూతన ఒరవడి సృష్టించారు.… pic.twitter.com/VOErNMuild
— Lokesh Nara (@naralokesh) June 8, 2025