రామోజీపై చంద్రబాబు,లోకేష్‌ ఏమన్నారంటే
x

రామోజీపై చంద్రబాబు,లోకేష్‌ ఏమన్నారంటే

వ్యాపారాల్లో కూడా ప్రజా హితం చూపించారని చంద్రబాబు అంటే, తుది శ్వాస వరకు ప్రజా శ్రేయస్సుకోసమే పని చేశారని లోకేష్‌ అన్నారు.


రామోజీరావు ప్రథమ వర్థంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్షరయోధుడని, విలువలతో కూడిన జర్నలిజంతో, నిష్పక్షపాత పాత్రికేయంతో రామోజీ ముద్ర వేశారంటూ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. తలవంచని నైజంతో వ్యాపారాల్లో కూడా రామోజీ ప్రజాహితం చూపించారని కొనియాడారు. ఆ మేరకు ఆదివారం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.

ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ప్రతి రంగంలో రామోజీ తనదైన ముద్రవేశారని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. పత్రికా రంగంలోను, వ్యాపార, సినిమా రంగాల్లో తనదైన ముద్రవేశారని అన్నారు. తుది శ్వాస వరకు ప్రజా శ్రేయస్సు కోసమే రామోజీ పని చేశారని లోకేష్‌ పేర్కొన్నారు. ఆ మేరకు ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా లోకేష్‌ ఓ పోస్టు పెట్టారు.


Read More
Next Story