
శభాష్.. భలే నిర్వహించారు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ వైభవంపై సీఎం చంద్రబాబు టీటీడీని అభినందించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శ్రీ మలయప్ప స్వామి వారి గరుడ వాహన సేవ సెప్టెంబరు 28, ఆదివారం నాడు అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం (సెప్టెంబరు 29) ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహణను అభినందించారు.
సీఎం చంద్రబాబు తన ట్వీట్లో ఇలా పేర్కొన్నారు: ‘‘తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీ మలయప్ప స్వామి వారి గరుడ వాహన సేవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి అభినందనలు. ఆదివారం నాటి పరమ పవిత్ర గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి తరలివచ్చిన 3 లక్షల మందికిపైగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారికి మంచి అనుభూతిని మిగిల్చారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించి, సమన్వయంతో వ్యవహరించిన టీటీడీ బోర్డుకు, దేవస్థానం అధికారులకు, ఉద్యోగులకు, శ్రీవారి సేవకులకు, జిల్లా అడ్మినిస్ట్రేషన్కు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు, ఆ శాఖ సిబ్బందికి అభినందనలు. తిరుమల కొండ పవిత్రతను కాపాడుతూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించిన భక్త కోటికి ధన్యవాదాలు’’ అంటూ సీఎం చంద్రబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీ మలయప్ప స్వామి వారి గరుడ వాహన సేవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి అభినందనలు. ఆదివారం నాటి పరమ పవిత్ర గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి తరలివచ్చిన 3 లక్షల మందికిపైగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు… pic.twitter.com/324Wovi68p
— N Chandrababu Naidu (@ncbn) September 29, 2025
Next Story