
విశాఖ బీచ్ ని పదిహేనేళ్లుగా కొరుక్కుతింటున్నారు....
ఎన్ని లేఖలు రాసిన ప్రభుత్వంలో చలన రావడం లేదు అంటున్నారు డా. ఇఎఎస్ శర్మ
విశాఖ బీచ్ దురాక్రమణలను, నిర్మాణాలను తొలగించేందుకు అయ్యే ఖర్చు భారం, జరిమానాలు, బాధ్యులైన రాజకీయ నాయకులు, అధికారులే భరించాలని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డా. ఇఎఎస్ శర్మ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్శి విజయానంద్ కి నేడు లేఖ రాశారు.
విశాఖ తీర ప్రాంతంలో, రామకృష్ణా బీచ్ నుంచి భీమిలి వరకు, CRZ నిబంధనలకు వ్యతిరేకంగా, గత పదిహేను సంవత్సరాల పాటు, విస్త్రుతంగా, భవన నిర్మాణం జరిగింది. CRZ నిబంధనల ప్రకారం, CRZ పరిథిలో బోర్ బావుల నుంచి, నీరు పంప్ చేయకూడదు. ఆ విషయంలో కూడా రాష్ట్ర హైకోర్టు వారు 2012 లో ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు కూడా ఉల్లంఘించబడ్డాయి. ఆ ఉల్లంఘనల విషయం, పదే పదే, నేను, విశాఖలో ఇతర పౌరులు, అన్ని స్థాయిల అధికారుల దృష్టికి తీసుకు వచ్చినా, అధికారులు స్పందించలేదు.
అంతేకాదు, అక్కడంతా అధికారులు, VIP లు వస్తున్నారనే నెపంతో, చట్ట విరుద్ధంగా, వీధి వ్యాపారుల మీద, ఇతర చిన్న వ్యాపారుల మీద, మురికివాడ ప్రజల మీద, దయాదాక్షిణ్యాలు చూపించకుండా దౌర్జన్యంగా ఖాలీ చేయించారు.
CRZ ఉల్లంఘనల మీద, అధికారుల స్పందన లేకపోవడం కారణంగా, ప్రత్యామ్నాయం లేకపోవడం వలన,కొంత మంది పౌరులు, గత రెండు మూడు నెలల్లో,రాష్ట్ర హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది.
కోర్టువారు, భీమిలి తీరంలో అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చిన తరువాతనే, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే, ప్రజల నిధుల నుంచి, కోటి రూపాయలకు మీద ఖర్చు జరిగింది అని వార్తలు వచ్చాయి.
CRZ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన నిర్మాణాలను తొలగించేందుకు అయిన ఖర్చు భారం ప్రజలు ఎందుకు భరించాలి?
నా ఉద్దేశంలో, అటువంటి ఖర్చు భారాన్ని, అందుకు బాధ్యులైన వ్యక్తుల నుంచి, వారికి మద్దతు ఇచ్చిన రాజకీయ నాయకుల నుంచి, భారీ జరిమానా తో సహా వసూలు చేయాల్సిన అవసరముంది. అటువంటి కట్టడాలు జరుగుతూ ఉంటే, చూస్తూ చర్యలు తీసుకొని ఉన్నత అధికారులను సస్పెండ్ చేసి, వారి మీద ప్రభుత్వ నిబంధనల కింద, చర్యలు తీసుకోవడం కూడా ఎంతో అవసరం.