వంశీకి ఫిట్స్‌ ఉన్నాయి..నిద్రలో శ్వాస ఆగిపోతోంది
x

వంశీకి ఫిట్స్‌ ఉన్నాయి..నిద్రలో శ్వాస ఆగిపోతోంది

కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీ ఆరోగ్యంతో ఆటలాడుతోందని వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


వల్లభనేని వంశీ అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు గుంటూరు గవర్నమెంట్‌ జనరల్‌ ఆసుపత్రిలో వైద్య నిపుణులు తేల్చారు. శ్వాసకు సంబంధించిన అనారోగ్య ఇబ్బందులుతో బాధపడుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యేను మెరుగైన వైద్య చికిత్సల కోసం సోమవారం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. విజయవాడ జైలు నుంచి ఆయనను ప్రత్యేక వాహనంలో పోలీసు బలగాలమ మధ్య గుంటూరుకు తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యులు లేక పోవడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ స్పెషలిస్టు డాక్టర్ల నేతృత్వంలో ఆయనకు పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

వైద్య పరీక్షల అనంతరం వల్లభనేని వంశీ మోహన్‌కు సంబంధించిన హెల్త్‌ బులిటెన్‌ను గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు విడుదల చేశారు. అందులో వంశీకి సంబంధించి ఆందోళనకర అంశాలను వెల్లడించారు. వంశీకి ఫిట్స్‌ ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా నిద్రపోతున్న సమయాల్లో వంశీకి శ్వాస అందడం లేదు.. శ్వాస ఆగిపోతుందని వెల్లడించారు. అయితే వీటికి చికిత్సలు అందించడానికి ప్రత్యేక స్లీప్‌ టెస్ట్‌ చేయల్సి ఉంటుందని గుంటూరు జీజీహెచ్‌లో ఆ స్లీప్‌ టెస్ట్‌ చేసేందుకు అవసరమైన పరికరాలు లేవని, అందువల్ల వేరే ఆసుపత్రికి రిఫర్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. విజయవాడ జైల్లో ఉన్న వంశీ ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం దోరణిని తీవ్రంగ తప్పుబట్టింది. వంశీ ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వంశీకి మెరుగైన వైద్య సేవలు అందించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తూ, కాలయాపన చేస్తోందని, ఇలా ప్రాణాలతో చెలగాటమేంటని సీఎం చంద్రబాబును ప్రశ్నించింది. ఆ మేరకు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ఓ ట్వీట్‌ చేసింది.


Read More
Next Story