
చిత్తూరు మామిడి రైతులకు యుక్రెయిన్ యుద్ధం దెబ్బ
యుక్రెయిన్ కు మామిడి గుజ్జులు ఎగుమతులు నిలిచిపోవడంతో డీలా పడిన చిత్తూరు మామిడి రైతులు
-జి. రామ్మోహన్
చిత్తూరు జిల్లా మామాడిరైతులకు రష్యా-యుక్రెయిన్ యుద్ధం బలంగా తగిలింది. దీనిని మామిడిరైతులు ముఖ్యంగా తోతాపురి (Totapuri) రకం పండించే రైతులు సంక్షభంలో పడిపోయారు. దీనికి తోడు మామిడి జ్యూస్ తయారుచేసే వాళ్లు మామిడి గుజ్జు (Mango Pulp) వాడాకాన్ని బాగా తగ్గించేరు. దీనితో చిత్తూరు జిల్లా మామిడి గుజ్జు పరిశ్రమంలు మందకొడిగా నడుస్తున్నాయి. వారు రైతులనుంచి పంటను కొనేయడం మానేశారు.దీనితో కాయలన్నీ కళ్లెదుటనే పండిరాలిపోతున్నాయి. రైతుకుటుంబాలను ఈ దృశ్యం కలచివేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో సుమారు 40 వేలఎకరాల్లో మామిడితోటలున్నాయి. వీటిలో ఎక్కువ భాగంలో తోతాపురి రకం పండిస్తారు. వీటిని మామిడి గుజ్జు తయారు చేసేందుకు వినియోగిస్తారు. చిత్తూరు జిల్లాలో తయారయ్యే 70 శాతం గుజ్జు ఎగుమతి అవుతుంది. కేవలం 30 శాతం మాత్రమే స్థానికంగా ఉపయోగిస్తారు. గుజ్జు తయారీ లో యిప్పుడు 47 పరిశ్రమలు వున్నాయి. ఎగుమలు కూడా ఎక్కువగా యుక్రెయిన్ దేశానికే వెళ్తుంటాయి. యుద్ధం కారణం మొదట గుజ్జు ఎగుమతులు తగ్గిపోయి, ఇపుడు నిలిచిపోయాయి. దీనితో అటుపరిశ్రమలు, ఇటు రైతులు ఆర్థిక సంక్షోభంలో పడిపోయాయి. ప్రతి ఏటా సుమారు రు.1500 కోట్ల విలువైన పంటని రైతులనుంచి కంపెనీలు కొనుగోలు చేస్తాయి.
యుక్రెయిన్ యుద్ధం వల్ల 2024లో చిత్తూరు జిల్లా నుంచి 2.75 లక్షల టన్నుల గుజ్జులు ఎగుమతులు నిలిచిపోయినట్లు అల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ (All India Food Processors Association (AIFPA) సౌత్ జోన్ చెయిర్మన్ కట్టమంచి గోవర్దన్ బాబీ చెప్పారు. యుక్రెయిన్ దేశం రష్యా, యూరోపియన్ యూనియన్, ఇండియాలనుంచి మామిడి గుజ్జును దిగుమతి చేసుకుంటుంది.
ప్రభుత్వం రంగ ప్రవేశం
గుజ్జు పరిశ్రమల యజమానులు పంటను కొనాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మామిడి ధరను రు. 12,000 గా నిర్ణయిoచినా మామిడి గుజ్జు పరిశ్రమలు తెరుచుకోవటం అనుమానంగానే ఉంద. దీని తో కాయలతో కళకళ’లాడవలసిన మండీలు నేటికీ జిల్లా లో వెల వెల పోతున్నాయి. ఎన్నో ఆశలతో పంట కోయాల్సిన రైతులు డీలాపడి పోయి వున్నారు. అయితే, ఇదంతా గుజ్జు పరిశ్రమ యాజమానుల అత్యాశ అని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ పరిస్థితి ని అవకాశం గా తీసుకుని తక్కువ ధరకు మామిడిని కొనాలని గుజ్జు పరిశ్రమల యజమానులు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
మాగిన కాయలు చేలలోనే రాలిపోన్నాయి. దానిని చూస్తుంటే గుండె తరుక్కు పోతోంది. పరిస్థితి ని అంచనా వేసి తగు చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ సుమిత్ కుమార్ యిటీవల రైతు నాయకులు ప్రజా ఒక సమావేశం నిర్వహించారు. యిందులో చిత్తూర్ పూతలపట్టు ఎమ్యెల్యేలు జి. జగన్ మోహన్ కే. మురళి మోహన్ లు కూడపాల్గొన్నారు.
గుజ్జు పరిశ్రమ యాజమాన్యం రైతుల సంక్షేమాన్ని దృష్టి లో వుంచుకుని వ్యవహరించాలని నిర్ణయించిన ధరకు తోటపురి కాయలు కొనలని కలెక్టర్ ఈ సమావేశం తర్వాత ఆదేశించారు. అదే సమయంలో కాయలను నేరుగా రైతుల నుండే కొనమని కూడా సూచించారు.
తమవద్ద వున్న యిప్పటికే వున్న గుజ్జు స్టాక్ కు మార్కెట్ లేదని, డిమాండ్ మందకొడిగా వుందని చెబుతు గుజ్జు పరిశ్రమల యాజమానులు పళ్లుకొనేందుకు ముందుకు రావడం లేదు.
ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ లేక పోవటాన్నివారు చూపుతున్నారు. "యుద్దాలు, ఆర్థిక మాంద్యం కారణం గా సుమారు 2.74 లక్షల టన్నుల గుజ్జు ఎగుమతి కాకుండా వుండటానికి కారణం గా చూపుతున్నారు. యిందులో కొంత అమ్మినా యిప్పటికి ఎక్కువ సరుకు మిగిలి పోయి వుందని కనుక తాము కొత్త సరుకు కొనలేము,’ అని యాజమనులు స్పష్టం చేస్తున్నారు.
ఈ పరిస్థితి లో చాలా మంది రైతులు తమ మామిడి పంటను పొలాలలోనే వదిలి వేయాల్సిన పరిస్థితి వుంది. కోసిన సరుకు మండి లకు చేరినా కొనేవారు లేరు. దీని ప్రభావం రైతుల పైనే కాక చిరు వ్యాపారస్తుల మీద, ఈ సీజన్ లో యిది కేవలం మామిడి ధరలు తగ్గింపునకు గుజ్జు పరిశ్రమ చేస్తున్న ప్రయత్నం గా దొరికే పనుల పైన ఆధారపడే వారి పైన తీవ్రంగా వుంది.
కలెక్టర్ ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొన్న రైతు నాయకుడు (FFA, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్) మంగటి గోపాల్ రెడ్డి అభివర్ణించారు. “వారి వద్ద ఉందని చెబుతున్న అంత సరుకు యిప్పడు లేదు. యిది కేవలం రైతుల ను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే,” అని ఆయన అన్నారు.
గుజ్జు పరిశ్రమ యాజమానుల సంఘం సెక్రెటరీ అయిన గోవర్ధన్ బాబీ మాట్లాడుతూ “పండ్లు యింకా పక్వానికి కూడా రాలేదు. తోతాపురి రకం కాయలు దిగుబడి బాగుంది. మేము ఎవరు కూడా నేరుగా ఎగుమతి చేసే వాళ్లం కాదు. మేము కేవలం ఆర్డర్ తీసుకుని గుజ్జు తయారు చేసి యిస్తాము. యుద్దం వల్ల ఎర్ర సముద్రం లో పడవలు పోలేని పరిస్థితిలో వేరే దారుల్లో మా సరుకు పోవాల్సి వస్తోంది. దీనితో మన గుజ్జు ధర పెరిగి అమ్ముడు పోని పరిస్థితి వచ్చింది. మనకంటే తక్కువ ధరకు పాకిస్థాన్, బ్రెజిల్ మరియు ఈజిప్ట్ దేశాలు యిస్తున్నాయి. మన మామిడి గుజ్జు కు వున్న రుచి వారి ఉత్పత్తికి లేక పోయినా ధరల వల్ల, యుద్ధం వలన మన ఉత్పత్తికష్టకాలం దాపురించింది. జ్యూస్ పరిశ్రమలుకూడా తమ ఉత్పత్తిలో మామిడి గుజ్జు వాడకాన్ని 18 నుండి 9 శాతానికి తగ్గించటం కూడా ఈ పరిస్థితి తీవ్రత మరొక కారణం. ఈ ఒక్క చర్య తోనే గుజ్జు డిమాండ్ సగానికి సగం పడిపోయింది,” అని ఆయన అన్నారు.
అంతే కాదు, తము రుణాలను చెల్లించేందుకు బ్యాంకులు మరో ఆరు నెలలు గడువీయాలని కోరామని కూడా ఆయన చెప్పారు.
“ దీనికి వాళ్ళు ఒప్పుకోక పోతే మా ఖాతాలు మొండి బకాయిలుగా పరిగణించ బడతాయి. ఈ నిర్ణయాన్ని బ్యాంకర్ ల కమిటీ సమావేశం లో తీసుకోవాలి. దీనికి తోడు విద్యుత్ పంపిణీ సంస్థలు మాపైన పాత 2022 ఛార్జీలు యిప్పుడు విధిస్తే ఎలా చెల్లించ గలం చెప్పండి,” అని ఆయన వాపోయారు.
ఈ లాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదని చిత్తూర్ జిల్లా సదుం మండలం పుట్టవారిపల్లె లోని మామిడి రైతు జి. చిన్న రెడ్డప్ప ఆవేదన చెందారు.
రైతులకు మామిడి గుజ్జు పరిశ్రమకు రెండింటికీ న్యాయం చేయాలనే తాము ధరను 12 రూపాయలుగా నిర్ణయించామని కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు.
ప్రభుత్వం అన్నీ విధాలా ఆదుకుంటుందని గుజ్జు పరిశ్రమ పని చేసే పరిస్థితి కల్పిస్తామని ఎమ్యెల్యేలు జగన్ మోహన్, మురళి మోహన్ హామీ యిచ్చారు. రైతుల ను యిబ్బంది పెట్ట వద్దని ఈ ప్రాంత ఆర్థిక పురోభివృద్ధి కి తోడ్పాటు అందించాలని వారు గుజ్జు పరిశ్రమ యాజమాన్యాన్ని కోరారు.
ఇండస్ట్రీ లెక్కల ప్రకారం చిత్తూరు జిల్లాలనుంచి 60,000 టన్నుల క్యాన్ డు గుజ్జు, 15 వేల టన్నులు ప్యాకేజ్ డ్ గుజ్జు విదేశాలకుఎగుమతి అవుతుంది.
యిప్పుడు పరిశ్రమ ఎలా స్పందిస్తుంది అనే దానిపైనే తదుపరి చర్యలు ఆధారపాడి వుంటాయి.
(జి.రామ్మోహన్, సీనియర్ జర్నలిస్టు. వ్యవసాయం, పర్యావరణ వ్యవహారాల నిపుణుడు, హైదరాబాద్)