
ఆంధ్ర అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా త్రివిక్రమరావు
పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజునుంచి రెండు సంవత్సరాలపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార భాషాసంఘానికి కొత్త అధ్యక్షుడిగా పి. త్రివిక్రమరావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు యువజన, పర్యాటక–సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజునుంచి రెండు సంవత్సరాలపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో తెలుగు భాష వినియోగాన్ని పర్యవేక్షించడం, వాడుక తీరుపై తనిఖీలు చేయడం, అవసరమైన సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇవ్వడం వంటి కీలక బాధ్యతలను ప్రభుత్వం భాషాసంఘానికి అప్పగించింది.
Next Story

