
‘ఆ నలుగురికి’ నివాళులు
ముగ్గురు ప్రముఖల జయంతి, ఒక తత్వవేత్త వర్థంతి సందర్భంగా లోకేష్ నివాళులు అర్పించారు.
నేడు నాటి బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి కాగా భారత దేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాపితం చేయడంతో పాటు భారత దేశ యువతకు స్పూర్తిగా నిలిచిన స్వామి వివేకానంద వర్థంతి. ఈ సందర్భంగా నలుగురు మహనీయులకు మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.
భారత స్వాతంత్యోద్యమ చరిత్రలో బ్రిటీష్ వారికి సింహస్వప్పంగా నిలిచిన గొప్ప పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు, మన్యంలో పోరాట వీరులను తీర్చిదిద్ది.. బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పునరింకితం అవుతాం. అంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.