అమెరికాలో పాలకొల్లు దంపతుల దుర్మరణం
x

అమెరికాలో పాలకొల్లు దంపతుల దుర్మరణం

వాషింగ్టన్ లో రోడ్డు ప్రమాదం, దంపతులు మృతి, పిల్లలకు గాయాలు


అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన తెలుగు దంపతులు మృతి చెందారు. పాలకొల్లుకు చెందిన కొటికలపూడి కృష్ణ కిశోర్‌ (టిన్ను) (45), ఆశ (40) వాషింగ్టన్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అదే ప్రమాదంలో వారి కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం వారి కుటుంబసభ్యులకు అందినట్లు తెలిసింది.

కృష్ణ కిశోర్‌ గత పదేళ్లకు పైగా అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులు ఇటీవలే పాలకొల్లు వచ్చి కుటుంబ సభ్యులను కలుసుకుని తిరిగి అమెరికాకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దుబాయ్‌లో న్యూఇయర్‌ వేడుకల్లో పాల్గొని అనంతరం వాషింగ్టన్‌కు చేరుకున్నారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఈ దుర్ఘటనతో పాలకొల్లు పట్టణంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. వారి మృతితో బంధుమిత్రులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Read More
Next Story