కొడుకంటే ఇలా ఉండాలి..శభాష్‌ లోకేష్‌
x

కొడుకంటే ఇలా ఉండాలి..శభాష్‌ లోకేష్‌

ఇటీవల ప్రదాన మంత్రి నరేంద్ర చేతుల మీదుగా యువళం పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కించారు.


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో సారి తన కొడుకు నారా లోకేష్‌ పట్ల ముగ్ధుడయ్యారు. లోకేష్‌ ఆధ్వర్యంలో ఇటీవల బాపట్లలో మెగా పేరెంట్స్‌ కమిటీ సమావేశంలోను, అంతకుముందు మంత్రి వర్గ సమావేశంలోను తనయుడి పనితీరుకు ముచ్చటపడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా మరో సారి మురిసిపోయారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుతూ నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రను ఓ పుస్తకం రూపంలో తేవడంపై చంద్రబాబు తెగ ముచ్చపడ్డారు, శభాష్‌ లోకేష్‌ అని అనకుండా ఉండలేక పోయారు.

రెండో రోజు కడప మహానాడు వేదికపై యువగళం పాదయాత్రకు సంబంధించిన విశేషాలతో రూపొందించిన ‘ద వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. తొలి కాపీని నారా లోకేష్‌కు అందజేశారు. అంతకు ముందు చాలా ఆసక్తిగా ఈ పుస్తకాన్ని చంద్రబాబు తిలకించారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ను చంద్రబాబు అభినందించారు. యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల్లో లోకేష్‌ చైతన్యం నింపారని, ఆనాటి అనుభవాలను ఒక పుస్తక రూపంలో తేవడం చాలా బాగుందని లోకేష్‌ను ప్రశంసించారు.
ఈ పుస్తకాన్ని ఇది వరకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ టూర్‌లకు అదిరిపోయే ఏర్పాట్లు చేసి అద్భుత రీతిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్‌ను ప్రధాని మోదీ అభినందిస్తూ ఓ సారి ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు. ఆ మేరకు లోకేష్‌ తన కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో డిన్నర్‌ కూడా చేశారు. దాదాపు రెండు గంటల విలువైన సమయాన్ని లోకేష్‌ కుటుంబానికి వెచ్చించారు. లోకేష్‌ కుమారుడు దేవాంష్‌తో కూడా మోదీ ఆడుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ యువగళం పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు. తన సంతకంతో కూడిన ఓ కాపీని లోకేష్‌కు అందజేశారు.
తర్వాత మహానాడు వేదికగా తన తండ్రి చంద్రబాబు తన చేతులు మీదుగా మరో సారి ఆవిష్కరించారు. 2023 జనవరి 27న లోకేష్‌ తన యువగళం పాదాయాత్రను కప్పుం నుంచి మొదలు పెట్టారు. 226 రోజుల పాటు తన పాదయాత్రను కొనసాగించారు. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజక వర్గాలు, 232 మండలాలు, 2,097 గ్రామాల మీదుగా లోకేష్‌ పాదయాత్ర చేపట్టారు. 226 రోజుల పాటు 3,132కిలోమీటర్ల మేర లోకేష్‌ చేపట్టిన తన పాదయాత్రలో తనను కదిలించిన అనేక సంఘటనలను ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్లుగా చూపించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
Read More
Next Story