మోదీతో పాటు వేదికపై ఉన్నది వీరే
x

మోదీతో పాటు వేదికపై ఉన్నది వీరే

ప్రధానిని ముఖ్యమంత్రి సాదరంగా సభావేదికపైకి తీసుకొని వెళ్లారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతికి చేరుకున్నారు. కేరళ నుంచి గన్నవరం చేరుకున్న మోదీ, అక్కడ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో అమరావతి సభా వేదిక వద్దకు చేరుకున్నారు. గన్నవరంలో అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, హోం మంత్రి అనిత ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.

అమరావతి సభా వేదిక వద్ద ప్రధాని మోదీకి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, ఇతర పెద్దలు స్వాగతం పలికారు. అనంతరం వేదికపైకి ప్రధాని నరేంద్ర మోదీని సాదరంగా ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని సభా వేదికపైకి దగ్గరుండి తీసుకొచ్చారు. అనంతరం ప్రధానికి సన్మానం చేశారు. సీఎం చంద్రబాబు ప్రధానికి శాలువా కప్పగా, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా తయారు చేసి మోదీ చిత్ర పటాన్ని అందజేశారు.
అంతకు ముందు సభా వేదికపైకి కూటమి మేళవించే విధంగా మూడు పార్టీలకు చెందిన మంత్రులను ఆహ్వానించారు. టీడీపీ నుంచి మంత్రి నారాయణ, మంత్రి నారా లోకేష్, జనసేన నుంచి పవన్‌ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి సత్యకుమార్‌ యాదవ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌లు ఆసీనులయ్యారు. కూటమి మిత్రత్వం ఎక్కడా దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
Read More
Next Story